News October 21, 2025

దుబాయ్‌లో పెట్టుబడిదారులతో పెద్దపల్లి MP భేటీ

image

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావాలనే లక్ష్యంతో పెద్దపల్లి MP గడ్డం వంశీకృష్ణ దుబాయ్‌లో ప్రముఖ పెట్టుబడిదారులతో మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలు పారిశ్రామిక పెట్టుబడుల కోసం అత్యంత అనుకూలమైన ప్రాంతాలని MP వివరించారు. బొగ్గు, విద్యుత్, రైల్వే, రోడ్లు వంటి మౌలిక వసతులు ఉన్న ఈ ప్రాంతాలలో పెట్టుబడులు పెడితే వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: తపాల శాఖ ఏజెంట్లకు.. దరఖాస్తుల ఆహ్వానం

image

తపాలా శాఖ బీమా పథకాలు పోస్టల్ జీవిత బీమా పీఎల్ గ్రామీణ తపాలా జీవిత బీమా(ఆర్పీఎస్ఐ) లకు సంబంధించి కమీషన్ పద్ధతిలో నియమించేందుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఖమ్మం జిల్లా పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. 10వ తరగతి పూర్తి చేసిన వాళ్లు చేసి, 18 ఏళ్ల వయస్సు నిండిన నిరుద్యోగులు, గృహిణులు అంగన్వాడీ సేవకులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు అర్హులని, ఈనెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News October 22, 2025

తిరుపతి జిల్లాలో కాలేజీలకు సెలవు

image

తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తిరుపతి జిల్లాలోని అన్ని స్కూళ్లకు బుధవారం సెలవు ప్రకటించారు. తాజాగా కాలేజీలకు సైతం సెలవు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. చిత్తూరు జిల్లాలోని స్కూళ్లకు సైతం హాలిడే ఇచ్చారు. ఆ జిల్లాలోని కాలేజీ సెలవులపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.

News October 22, 2025

GNT: వారు తడబడినా.. మనమే ఆత్మవిశ్వాసం నింపాలి.!

image

ప్రతి సంవత్సరం అక్టోబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ నత్తి నివారణ అవగాహన దినోత్సవం జరుపుకుంటారు. గుంటూరు జిల్లాలో పెద్దలలో తడబడటం సుమారు 1% వరకు ఉన్నట్లు నిపుణులు తెలిపారు. పిల్లల్లో మొదట్లో గుర్తించి చికిత్స ప్రారంభిస్తే సమస్యను తగ్గించవచ్చని వైద్యులు సూచించారు. స్పీచ్ థెరపిస్టులు తడబడే సహాయం చేస్తున్నప్పటికీ, నత్తి సమస్యతో బాధపడుతున్న వారిలో ఆత్మవిశ్వాసం పెంచడం ఈరోజు ప్రధాన ఉద్దేశం.