News October 21, 2025
చిత్తశుద్ధి, నీతి, నీజాయితీతో పనిచేయాల్సి ఉంటుంది: CP

ప్రజల సేవ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు మహనుభావులని, పోలీసు అమరవీరుల చూపిన మార్గదర్శకాన్ని అనుసరిస్తూ, ప్రజల శ్రేయస్సు కోరకు పాటుపడాలని సీపీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజల్లో మంచి పేరు రావాలంటే చిత్తశుద్ధి, నీతి, నిజాయితీతో పనిచేయాల్సి ఉంటుందని, అసువులు బాసిన అమరవీరుల కుటుంబాలను కాపాడుకోవాల్సిన భాధ్యత మనందరిపై ఉందన్నారు.
Similar News
News October 21, 2025
సర్ఫరాజ్ ఖాన్కు నిరాశ.. నెటిజన్ల ఫైర్!

SA-Aతో 4-డే మ్యాచులకు BCCI ప్రకటించిన IND-A <<18062911>>జట్టులో<<>> సర్ఫరాజ్ ఖాన్కు చోటు దక్కలేదు. దీంతో సెలక్టర్లపై నెటిజన్లు ఫైరవుతున్నారు. సర్ఫరాజ్కు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 65+ AVg ఉందని, ఇటీవల ENG-Aపై ఓ మ్యాచులో 92, రంజీ మ్యాచులో 74 రన్స్ చేశారని, 17kgs బరువు తగ్గడంతో పాటు Yo-Yo టెస్ట్ పాసయ్యారని గుర్తుచేస్తున్నారు. దేశవాళీలో బాగా రాణిస్తున్నా జాతీయ జట్టుకు సెలక్ట్ చేయకపోవడం కరెక్ట్ కాదని అంటున్నారు.
News October 21, 2025
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత, రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్కు వివరించారు.
News October 21, 2025
MHBD: ఉదయ్ నాగ్ అమరవీరుడై.. 17 ఏళ్లు!

MHBD జిల్లా మరిపెడ మండలానికి చెందిన గ్రేహౌండ్ పోలీస్ ఉదయ్ నాగ్ అమరవీరుడై 17 ఏళ్లు అయింది. అతి చిన్న వయసులో అతి కష్టమైన గ్రేహౌండ్స్ బలగాల్లో ఎంపికై మావోయిస్టులతో వీరోచిత పోరాటం చేశాడు. 2008 జూన్ 29న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లాలో కూంబింగ్ ముగిసిన అనంతరం బలగాలు బలిమెల వద్ద బోటులో ప్రయాణం అవుతుండగా మావోలు గ్రానైట్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఉదయ్ నాగ్తో సహా 75 మంది పోలీసులు అమరులయ్యారు.