News October 21, 2025
మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా: కలెక్టర్

మాదకద్రవ్య రహిత రాష్ట్రం కోసం ఈగల్ నిఘా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి గంజాయి, మత్తు పదార్థాల ఉత్పత్తి, కఠిన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. అదృశ్యమైన 670 మంది బాలికలను ఒక్క నెలలోనే గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించారన్నారు. ఆపరేషన్ సేఫ్ డ్రైవ్ నిర్వహించి 25,807 కేసులు నమోదు చేసి రూ.40.62 లక్షల జరిమానా విధించారని అన్నారు.
Similar News
News October 22, 2025
కార్తీకం: ప్రమిదల్లో ఎన్ని వత్తులు ఉండాలి?

కార్తీక మాసంలో ప్రమిదలో రెండు వత్తులను వెలిగిస్తే శాంతి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. 3 వత్తులు ధనవృద్ధినీ, నాలుగు ఐశ్వర్యాన్నీ, ఐదు అఖండ సంపదల్నీ, ఏడు మోక్షాన్నీ ప్రసాదిస్తాయంటున్నారు. మనలో ఉండే పంచతత్వాలకు నిదర్శనంగా 5 రుచులతో ఉండే ఉసిరికపైనా దీపాన్ని వెలిగించవచ్చని పేర్కొంటున్నారు. అయితే ఒక వత్తిని వెలిగించినా పుణ్యం లభిస్తుందని వివరిస్తున్నారు.
News October 22, 2025
అక్కన్నపేట: విద్యుత్ స్తంభమెక్కిన పొదలు

అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభంపై వెలుగుతున్న వీధి దీపానికి చెట్టు తీగ స్తంభం పైకి ఎక్కింది. వెలుతురును కనపించని విధంగా తీగ వీధి దీపం చుట్టూ అలుముకుంది. దీనిని చూసిన పలువురు విద్యుత్ దీపానికి కంచె మాదిరిగా ఉందంటూ సంభాషించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ వెలుతురుకు అడ్డుగా ఉన్న తీగను అధికారులు తొలగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.
News October 22, 2025
తిరుపతి: శైవక్షేత్రం దర్శనం.. కార్తీక మాస పుణీతం

పవిత్రమైన కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రముఖ శివాలయాలను గురించి తెలుసుకుందాం.
➤ శ్రీకాళహస్తి శ్రీ వాయిలింగేశ్వర స్వామి
➤ గుడిమల్లం శ్రీ పరశురామేశ్వర స్వామి
➤ కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామి
➤ జీవకోన శ్రీ జీవలింగేశ్వర స్వామి
➤ యోగి మల్లవరం పరశారేశ్వర స్వామి
➤ వెదల్లచెరువు శివాలయం
తదితర ఆలయాల్లో విశేష ఉత్సవాలు జరగనున్నాయి.