News April 9, 2024

పాడేరు ఆసుపత్రిని సందర్శించిన కలెక్టర్

image

పాడేరులోని మాతా శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలువురు గర్భిణులు, బాలింతలతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, ఆహారం తదితర అంశాలపై ఆరా తీశారు. చీడివలసకు చెందిన ఓ బాలింతకు అది నాలుగో కాన్పు అని తెలుసుకొని, ఆమెకు కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పించారు. కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సకు ఒప్పించినట్లు పేర్కొన్నారు.

Similar News

News October 4, 2025

బీచ్‌లను సుందరంగా తీర్చిదిద్దండి: జీవీఎంసీ కమిషనర్

image

విశాఖలో త్వరలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్, ఐఎఫ్ఆర్ దృష్ట్యా బీచ్‌లను పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దాలని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అధికారులను ఆదేశించారు. కాలువల ద్వారా వ్యర్థాలు సముద్రంలో కలవకుండా ఉండేందుకు కాలువల వద్ద వెంటనే స్క్రీన్లు, ఆధునిక వలలు ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు.

News October 4, 2025

ఎన్‌ఏడీలో తప్పనున్న ట్రాఫిక్ కష్టాలు..!

image

విశాఖలోని అత్యంత రద్దీ ప్రాంతమైన ఎన్‌ఏడీ జంక్షన్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు పనులు వేగవంతమయ్యాయి. ఎన్‌ఏడీ నుంచి కాకానినగర్ వరకు 11 మీటర్ల వెడల్పుతో తేలికపాటి వాహనాల కోసం నిర్మిస్తున్న ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025 చివరి నాటికి దీనిని పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది అందుబాటులోకి వస్తే గాజువాక వైపు వెళ్లే వాహనదారుల ప్రయాణం సులభతరం కానుంది.

News October 4, 2025

విశాఖ ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా

image

విశాఖలోని అన్నదాన కార్యక్రమంలో గంజిపడి <<17913036>>చిన్నారులు గాయపడిన<<>> ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో 20 మంది చిన్నారులను ఆస్పత్రికి తరలించగా, ఆరుగురు చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. స్వల్ప గాయాలైన ఇతరులను డిశ్చార్జ్ చేశామని, బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు.