News October 21, 2025
MHBD: ఎలక్షన్లని ఊరించారు.. తీరా ఆపేశారు..!

TGలో ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో MHBD జిల్లాలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. తీరా BCలకు 42% రిజర్వేషన్కు కోర్టు స్టే ఇవ్వడంతో ఎలక్షన్ వాయిదా పడింది. సర్పంచ్ల పదవీకాలం ముగిసి 20 నెలలు కావొస్తుండగా.. ఎలక్షన్లు జరిగి సర్పంచ్ని ఎన్నుకుంటే గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు అనుకున్నారు. ఎన్నికలు ఊరించి ఒక్కసారిగా నిలిచిపోవడంతో ఆశావహులు నిరాశ చెందారు. MHBD జిల్లాలో 482 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
Similar News
News October 22, 2025
జైషే మహ్మద్ మరో కుట్ర?

పాక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రసంస్థ జైషే మహ్మద్ మరో కుట్రకు తెరలేపినట్లు తెలుస్తోంది. ఇటీవల ఏర్పాటైన <<17958042>>మహిళా వింగ్ <<>>కోసం రిక్రూట్మెంట్, నిధులు సేకరించేందుకు ఆన్లైన్ జిహాదీ కోర్స్ ప్రారంభించినట్లు సమాచారం. జైషే చీఫ్ మసూద్ సిస్టర్స్ సాదియా, సమైరా, మరికొందరు రోజూ 40నిమిషాలు పాఠాలు చెప్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేవారు 500 పాక్ రుపీస్ డొనేషన్ ఇవ్వాలంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
News October 22, 2025
పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించారా?

తెలుగు రాష్ట్రాల్లో పశువుల్లో ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేస్తున్నారు. నవంబర్ 14 వరకు అన్ని జిల్లాల్లో పశువులకు వీటిని అందించనున్నారు. 4 నెలల వయసు పైబడిన పశువులు అన్నింటికీ ఈ వ్యాక్సిన్స్ వేస్తారు. పశుపోషకుల ఇళ్ల వద్దకే సిబ్బంది వచ్చి ఉచితంగా టీకాలు అందిస్తున్నారు. పాడిరైతులు నిర్లక్ష్యం చేయకుండా పశువులకు ఈ వ్యాక్సిన్స్ వేయించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు కోరుతున్నారు.
News October 22, 2025
సత్య నాదెళ్లకు రూ.846 కోట్ల జీతం

మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల జీతం భారీగా పెరిగింది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన ప్యాకేజీ అంతకుమందు ఏడాదితో పోలిస్తే 22% అధికమైంది. ప్రస్తుతం ఆయన ఏడాదికి 96.5 మి.డాలర్ల (రూ.846 కోట్లు) జీతం అందుకుంటున్నారు. సత్య నాదెళ్ల, ఆయన లీడర్షిప్ టీమ్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మైక్రోసాఫ్ట్ పురోగతి సాధించిందని కంపెనీ బోర్డు తెలిపింది. అలాగే షేర్ల ధరలు పెరిగాయని పేర్కొంది.