News October 21, 2025

భాగ‌స్వామ్య స‌ద‌స్సుకు ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాలి: విశాఖ కలెక్టర్

image

న‌వంబ‌ర్ 14, 15వ తేదీల్లో విశాఖ‌ వేదిక‌గా జ‌ర‌గ‌నున్న భాగ‌స్వామ్య స‌ద‌స్సు ఏర్పాట్లపై క‌లెక్ట‌ర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ అధికారుల‌తో స‌మీక్షించారు. ఏయూ ఇంజినీరింగ్ క‌ళాశాల మైదానంలో ప‌టిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. వీఐపీలు, అతిథుల కోసం పార్కింగ్, భ‌ద్ర‌త‌, వైద్య‌, పారిశుద్ధ్య ఏర్పాట్లు, తాగునీరు, హోట‌ల్ వ‌స‌తి, హోం స్టేల‌ను సిద్ధం చేయాల‌ని సూచించారు.

Similar News

News October 22, 2025

విశాఖ: వీకెండ్‌లో ప్రత్యేక సర్వీసులు

image

కార్తీక మాసం నేపథ్యంలో ఆర్టీసీ పంచారామ క్షేత్రాల దర్శనానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. విశాఖ ద్వారక బస్ స్టేషన్ నుంచి ప్రతి శని,ఆదివారాల్లో ఈ సర్వీసులు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. లగ్జరీ, డీలక్స్, ఇంద్ర సర్వీసులకు సంబంధించి వేర్వేరుగా ధరలు నిర్ణయించారు. మరిన్ని వివరాలకు డిపోలో సంప్రదించాలని అధికారులు కోరారు.

News October 22, 2025

గంటా శ్రీనివాస్ జోక్యంతో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి గ్రీన్ సిగ్నల్

image

చంద్రంపాలెం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి మెట్రో ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చొరవతో మెట్రో ఎండీ రామకృష్ణారెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రూ.3.23 కోట్లతో నిర్మించే ఈ బ్రిడ్జి నిర్మాణంపై మెట్రో అధికారులు అభ్యంతరం చెప్పారు. దీంతో గంటా సమస్యను వివరించి మెట్రో డిజైన్‌ను బ్రిడ్జి కంటే ఎత్తులో ఖరారు చేయించారు.

News October 21, 2025

పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి: మేయర్

image

అంతర్జాతీయ కార్యక్రమాలకు విశాఖను సుందరీకరించండని మేయర్ పీలా శ్రీనివాసరావు జీవీఎంసీ అధికారులను ఆదేశించారు. కార్మికుల హాజరును పరిశీలించి, వారి వేతనాలను సకాలంలో చెల్లించాలన్నారు. బీచ్ రోడ్డులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడానికి ఎక్కువ మంది కార్మికులను నియమించాలని, గైర్హాజరైన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో అదనంగా టాయిలెట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.