News October 21, 2025
మెట్ట ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయిని పెంచాలి: కలెక్టర్

జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో మంగళవారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్దరణ, తదితర అంశాలపై అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ముఖ్యంగా మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉందని, భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News October 22, 2025
GNT: మంచు మొదలైంది బాసు.. జాగ్రత్తగా నడుపు.!

కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఉదయం చలితోపాటు మంచు మొదలైంది. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కువ శాతం వ్యవసాయ భూములు ఉండటంతో, ప్రయాణం చేసే వారికి జాగ్రత్త అవసరం. మంచు పెరగడంతో దారులు కనబడటం కష్టతరం కావచ్చు. వాహనదారులు వేగం తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ, రోడ్ల పరిస్థితిని గమనిస్తూ ప్రయాణించాలి. జాగ్రత్త మీ వేగం మీ కుటుంబానికే కాదు.. మరో కుటుంబానికి కూడా దుఃఖాన్ని మిగులుస్తుంది.
News October 22, 2025
2,570 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

RRB 2,570 ఇంజినీరింగ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా, బీటెక్ అర్హతగల అభ్యర్థులు ఈనెల 31 నుంచి నవంబర్ 30వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 33ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT-1, CBT-2), సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: https://www.rrbapply.gov.in
News October 22, 2025
ఎస్.ఆర్.శంకరన్ సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్

ప్రజల అధికారిగా ఎస్.ఆర్. శంకరన్ ప్రసిద్ధి చెందారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా అన్నారు. శంకరన్ జయంతిని కలెక్టర్ కార్యాలయలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి కలెక్టర్, ఇతర అధికారులు పూలమాలలు చేసి నివాళులు అర్పించారు. ప్రజలతో కలిసిమెలసి పని చేసిన వ్యక్తి శంకరన్ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి శంకరన్ తన జీవితాన్ని అంకితం చేశారని కలెక్టర్ పేర్కొన్నారు.