News October 21, 2025
HYD: ప్రభుత్వం వద్దకు మెట్రో.. సిబ్బందిలో టెన్షన్..!

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ప్రస్తుతం మెట్రో రైల్ ప్రాజెక్టులో 1,300 మంది రెగ్యులర్ స్టాఫ్, 1,700 మంది అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. మెట్రో రైల్ నిర్వహించే ఎల్ అండ్ టీ సంస్థకు ఫ్రాన్స్ సంస్థ కియోలిస్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తోంది. ఇవన్నీ గమనిస్తున్న స్టాఫ్ తమ పరిస్థితి ఏమిటో అని ఒకింత ఆందోళనకు గురవుతున్నారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ఓపిక లేదని వెళ్లిపోయారు!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులకే చిరాకు వచ్చింది. నిన్న పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అధికారులు టోకెన్లు ఇచ్చారు. బుధవారం తెల్లవారుజాము వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగడంతో టోకెన్లు తీసుకున్న కొందరు అర్ధరాత్రి దాటినా ఇంకా సమయం పడుతుందని తెలిసి, ఇక తమ వల్ల కాదంటూ వెనక్కి వెళ్లిపోయారు. 10 మందికిపైగా అభ్యర్థులు టోకెన్లు తీసుకొని నామినేషన్ వేయనట్లు అధికారులు గుర్తించారు.
News October 22, 2025
‘కార్తీక మాసం’ అనే పేరెందుకు?

నక్షత్ర గమనం ఆధారంగా ఈ మాసానికి కార్తీక మాసం అనే దివ్య నామం సిద్ధించింది. శరదృతువులో వచ్చే ఈ పుణ్య మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు ఆకాశంలో కృత్తికా నక్షత్రం వద్ద సంచరిస్తాడు. అందువల్లే ఈ మాసానికి ‘కార్తీక’ అని పేరు వచ్చింది. తెలుగు మాసాలలో ఈ మాసం అతి పవిత్రమైనది. ‘న కార్తీక నమో మాసః’ అంటే కార్తీకానికి సమానమైన మాసం లేదని పురాణాలు కీర్తిస్తున్నాయి. శివకేశవుల అనుగ్రహం పొందడానికి ఈ మాసం ఉత్తమమైనది.
News October 22, 2025
రాఘవేంద్ర స్వామిని దర్శించిన మంత్రులు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అంతకుముందు మాంచాలమ్మ ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు.