News October 21, 2025
భూభారతి’ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలి: కలెక్టర్

వలిగొండ మండలంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. భూ సమస్యల సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించాలని ఆదేశించారు. కుల,ఆదాయ, జనన, మరణ ధ్రువీకరణ పత్రాల దరఖాస్తులను పెండింగ్లో లేకుండా పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో ఎంఆర్ఓ దశరథ, ఎంపీడీఓ జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.
Similar News
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.
News October 22, 2025
VKB: ఇద్దరు ఆడపిల్లలను ఒంటరిగా వదిలేసిన తండ్రి

వికారాబాద్ పట్టణంలో రాత్రి ఒంటరిగా ఉన్న ఇద్దరు ఆడపిల్లలను గుర్తించిన పోలీసులు చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బందికి అప్పగించారు. హైదరాబాద్ నుంచి కారులో వచ్చి ఎస్బీఐ బ్యాంక్ వద్ద తండ్రి తమను వదిలి వెళ్లినట్లు పిల్లలు తెలిపారు. వారు గుర్దొడ్ల తమ అమ్మమ్మ ఊరు అని చెప్పారు. దీంతో అధికారులు పిల్లలను శిశుగృహకు తరలించారు. తల్లిదండ్రుల ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని చైల్డ్ హెల్ప్లైన్ అధికారులు కోరారు.
News October 22, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. హోటళ్లకు భారీ డిమాండ్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు కేవలం 17 రోజుల ప్రచార సమయం మిగిలి ఉండటంతో రాజకీయ వేడి పెరిగింది. అభ్యర్థులు తమ ప్రచారాన్ని వేగవంతం చేస్తూ అన్ని ప్రాంతాలను కవర్ చేయడానికి ప్రణాళికలు వేస్తున్నారు. దీంతో ఇతర జిల్లాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు వసతి కల్పించేందుకు జూబ్లీహిల్స్తో పాటు చుట్టుపక్కల హోటళ్లు కిటకిటలాడుతున్నాయి. ఉప ఎన్నికల కారణంగా ఈ ప్రాంతంలో హోటల్ గదులకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది.