News October 21, 2025
ప్రపంచ నేతలు.. ఆసక్తికర విషయాలు!

అగ్రదేశాలకు అధినేతలుగా పని చేసిన/చేస్తున్న శక్తిమంతమైన నేతలు వాళ్లు. తమ పాలనతో చెరగని ముద్ర వేశారు. వారి గతంలోని ఆసక్తికర విషయాలు.. *మన్మోహన్ సింగ్-పబ్లిక్ సర్వీసులోకి రాకముందు ప్రొఫెసర్. *ఏంజెలా మెర్కెల్-క్వాంటమ్ కెమిస్ట్రీలో డాక్టరేట్. *జెలెన్స్కీ-కమెడియన్. *విన్స్టన్ చర్చిల్-చిత్రకారుడు. *బైడెన్-లైఫ్గార్డుగా పని చేశారు. *ఒబామా-ఐస్ క్రీమ్ స్కూపర్గా పని చేశారు. పుతిన్-ఇంటెలిజెన్స్ ఆఫీసర్.
Similar News
News October 22, 2025
SECLలో 1,138 పోస్టులు.. అప్లై చేశారా?

సౌత్ ఈస్ట్రర్న్ కోల్ఫీల్డ్స్ (SECL) 1,138 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. Asst ఫోర్మెన్(543 ), మైనింగ్ సిర్దార్, Jr ఓవర్మెన్(595) పోస్టులు ఉన్నాయి. మైనింగ్ సిర్దార్, Jr ఓవర్మెన్ జాబ్లకు OCT 30 అప్లైకి ఆఖరు తేదీ కాగా.. Asst ఫోర్మెన్ పోస్టులకు NOV 9 లాస్ట్ డేట్. పోస్టును బట్టి డిప్లొమా, BE, బీటెక్ పాసై ఉండాలి.
*మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
గూగుల్ క్రోమ్కు పోటీగా ‘అట్లాస్’

గూగుల్ క్రోమ్కు పోటీగా OpenAI ‘అట్లాస్’ అనే సొంత వెబ్ బ్రౌజర్ను లాంచ్ చేసింది. AI చాట్బాట్ ChatGPT ద్వారా వరల్డ్లో మోస్ట్ వాల్యుబుల్ స్టార్టప్గా OpenAI ఎదిగింది. ఇప్పుడు యూజర్లను పెంచుకుని డిజిటల్ అడ్వర్టైజింగ్ ద్వారా రెవెన్యూ ఆర్జించేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాపిల్ ల్యాప్టాప్స్లో ‘అట్లాస్’ను లాంచ్ చేయగా త్వరలో మైక్రోసాఫ్ట్ విండోస్, యాపిల్ iOS, ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.
News October 22, 2025
ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.