News October 21, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో డబుల్ సెంచరీ దాటనున్న నామినేషన్స్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల హీట్ పెరుగుతోంది. అంచనాలను మించి అభ్యర్థుల రద్దీ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయంలో టోకెన్లు తీసుకున్న వారి వద్ద నుంచి RO నామినేషన్లు స్వీకరిస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఈ ప్రక్రియ కొనసాగనుండగా నామినేషన్లు డబుల్ సెంచరీ దాటే సూచనలు కనిపిస్తున్నాయి.

Similar News

News October 22, 2025

కొత్త దర్శకుల విజయం: వినూత్న కథాంశాలే బలం!

image

వినూత్న కథలతో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో యువ డైరెక్టర్లు సఫలమవుతున్నారు. సూపర్ హీరో జోనర్‌ ‘హనుమాన్’తో భారీ విజయం పొందారు ప్రశాంత్ వర్మ. HIT 1&2తో క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్‌తో శైలేష్ కొలను అదరగొట్టారు. అరిషడ్వర్గాలు అనే మైథలాజికల్ అంశంపై సస్పెన్స్ థ్రిల్లర్ ‘అరి’ మూవీతో మెప్పించారు డైరెక్టర్ జయశంకర్. 96, సత్యంసుందరంతో తమిళ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ తెలుగువాళ్లకు దగ్గరయ్యారు.

News October 22, 2025

మీ డబ్బు-మీ హక్కు పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్

image

మీ డబ్బు-మీ హక్కు అనే నినాదంతో భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా 3 నెలల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిందని కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. బుధవారం నంద్యాల కలెక్టర్ ఛాంబర్‌లో “మీ డబ్బు-మీ హక్కు” అనే గోడ పత్రికను విడుదల చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా పౌరులు తమ పేర్లపై ఉన్న క్లెయిమ్ చేయని లేదా మరచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పించబడుతోందన్నారు.

News October 22, 2025

వేములవాడ: ‘ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు పెంచాలి’

image

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. వేములవాడ మండలం రుద్రవరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీలను ఎప్పటికప్పుడు గుర్తించి రికార్డులలో నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది విక్రమ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.