News October 22, 2025
ధర్మపురి డిగ్రీ కళాశాల మంజూరుకు సీఎంకు కృతజ్ఞతలు

ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని మంగళవారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ధర్మపురి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించారు. అనతంరం కృతజ్ఞతలు తెలిపారు. ధర్మపురి నియోజకవర్గాన్ని రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
Similar News
News October 22, 2025
మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు గంటల వ్యవధిలో <<18069819>>మరోసారి<<>> భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.4,690 తగ్గి రూ.1,25,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిిడి రూ.4,300 పతనమై రూ.1,15,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.7,000 క్షీణించి రూ.1.75 లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 22, 2025
కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.
News October 22, 2025
‘పేరు వల్లే’ సర్ఫరాజ్ సెలక్ట్ కాలేదా: షమా

సౌతాఫ్రికా-Aతో పంత్ సారథ్యంలో ఆడనున్న టీమ్ ఇండియా-A జట్టులో సర్ఫరాజ్ ఖాన్ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖాన్ అనే ఇంటిపేరు వల్లే సర్ఫరాజ్ను ఎంపిక చేయలేదా? జస్ట్ ఆస్కింగ్. ఇలాంటి విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు’ అని AICC అధికార ప్రతినిధి షమా మహ్మద్ ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాని కాంగ్రెస్ మతం పేరుతో వేరు చేయాలని చూస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.