News October 22, 2025

నేడు యూఏఈకి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు నేటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనున్నారు. ఇవాళ 10amకు హైదరాబాద్ నుంచి దుబాయ్ బయలుదేరుతారు. వచ్చే నెల 14-15 తేదీల్లో విశాఖలో జరిగే సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా మూడు రోజుల్లో రోడ్ షోతో పాటు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు.

Similar News

News October 22, 2025

మరోసారి భారీగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు గంటల వ్యవధిలో <<18069819>>మరోసారి<<>> భారీగా తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం ఇచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.4,690 తగ్గి రూ.1,25,890కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిిడి రూ.4,300 పతనమై రూ.1,15,400 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ఏకంగా రూ.7,000 క్షీణించి రూ.1.75 లక్షలుగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 22, 2025

‘పేరు వల్లే’ సర్ఫరాజ్‌ సెలక్ట్ కాలేదా: షమా

image

సౌతాఫ్రికా-Aతో పంత్ సారథ్యంలో ఆడనున్న టీమ్ ఇండియా-A జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘ఖాన్ అనే ఇంటిపేరు వల్లే సర్ఫరాజ్‌ను ఎంపిక చేయలేదా? జస్ట్ ఆస్కింగ్. ఇలాంటి విషయంలో గంభీర్ ఎలా వ్యవహరిస్తారో మనకు తెలుసు’ అని AICC అధికార ప్రతినిధి షమా మహ్మద్ ట్వీట్ చేశారు. టీమ్ ఇండియాని కాంగ్రెస్ మతం పేరుతో వేరు చేయాలని చూస్తోందని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

News October 22, 2025

AP న్యూస్ రౌండప్

image

*పాయకరావుపేట నియోజకవర్గంలోనే లక్ష ఉద్యోగాలిస్తాం: హోంమంత్రి అనిత
*కూలిన విద్యుత్ స్తంభాలను పునరుద్ధరించాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి ఆదేశం
*కడప జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఉగ్రవాది అబూబకర్‌ సిద్ధికి భార్య సైరాబానును కస్టడీకి తీసుకుని VJA తరలించిన NIA అధికారులు
*గుంటూరు(D) ఇటికంపాడు రోడ్డు శివారులో పిడుగుపాటుకు మరియమ్మ(45), షేక్ ముజాహిద(45) అక్కడికక్కడే మృతి