News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

Similar News

News October 22, 2025

పొందూరు: ‘100% దివ్యాంగుడిని..పింఛన్ ఇచ్చి ఆదుకోండి’

image

తన దైనందిక జీవితంలో రోజు వారి పనులకు తల్లిదండ్రులపైనే ఈ దివ్యాంగుడు ఆధారపడాల్సిన పరిస్థితి. పొందూరు(M) తండ్యాం పంచాయతీ బొట్లపేట గ్రామానికి చెందిన మేకా నవీన్ కుమార్‌ 100 శాతం దివ్యాంగుడు. సదరం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పెన్షన్ మంజూరయ్యేలా చూడాలని కుటుంబీకులు కోరుతున్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘గుర్తు తెలియని వ్యక్తి మృతి’

image

శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఈ నెల 19న ఓ వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల సమాచారంతో 108 అక్కడికి చేరుకుంది. అనంతరం అతడిని శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్చగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. దీనిపై సీఐ ఈశ్వరరావు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు స్థానిక పోలీసు స్టేషన్ సంప్రదించాలన్నారు.

News October 22, 2025

శ్రీకాకుళం: ‘ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలి’

image

ప్రకృతి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్ట్ మేనేజర్ సత్యనారాయణ అన్నారు . జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో మంగళవారం క్షేత్రస్థాయి సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. రసాయన ఎరువులు, పురుగుల మందు రహిత వ్యవసాయం లక్ష్యంగా రైతులు ముందుకు సాగాలని అన్నారు. సహజ ఎరువులు, కషాయాలు వినియోగించాలని కోరారు.