News October 22, 2025
GNT: ఓ శకం ప్రారంభమై నేటికి పదేళ్లు

2014లో ఏపీ విభజన ఫలితంగా మిగిలిన రాష్ట్రానికి రాజధాని లేక నూతన రాజధాని అమరావతి శంకుస్థాపన 2015 అక్టోబర్ 22న దసరా రోజున జరిగింది. దీనికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు ఉద్దండరాయునిపాలెంలో శంకుస్థాపన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపట్టింది. 2017 నుంచి వెలగపూడిలో పనిచేయడం ప్రారంభించింది.
Similar News
News October 24, 2025
పాక్కు షాక్.. నీళ్లు వెళ్లకుండా అఫ్గాన్లో డ్యామ్!

పాక్కు నీళ్లు వెళ్లకుండా నియంత్రించాలని అఫ్గాన్ ప్లాన్ చేస్తోంది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యామ్ నిర్మించాలని తాలిబన్ సుప్రీంలీడర్ మౌలావీ హైబతుల్లా అఖుంద్జాదా ఆదేశాలిచ్చారు. విదేశీ కంపెనీల కోసం చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలని సూచించారు. 2 దేశాల మధ్య సరిహద్దు ఘర్షణల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత <<16207281>>సింధూ జలాల<<>> ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం తెలిసిందే.
News October 24, 2025
విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి కృషి: కలెక్టర్

విభిన్న ప్రతిభావంతులు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్లో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు, గిరిజన నుంచి ఆయన అర్జీలు స్వీకరించారు. వాటిని సంబంధిత అధికారులకు అందజేసి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించినట్లు తెలిపారు.
News October 24, 2025
జూబ్లీహిల్స్ బస్తీల్లో మంత్రి సీతక్క

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపిస్తే ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతాయని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమె బోరబండలోని సైట్ 3 ప్రాంతంలో పర్యటించి ఇంటింటికీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. రూ.కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు గుర్తు చేశారు.