News October 22, 2025
ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారతీయురాలు

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ బచేంద్రీ పాల్. 1985లో ఇండో- నేపాలీ మహిళలతో కలిసి ఎవరెస్ట్ యాత్ర చేపట్టి, 7 ప్రపంచరికార్డులు సృష్టించారు. హరిద్వార్ నుంచి కలకత్తా వరకు 2,500 కి.మీ. మేర గంగా నదిలో యాత్ర సాగించిన రాఫ్టింగ్ బృందానికి నాయకత్వం వహించారు. పద్మశ్రీ, అర్జున అవార్డు, భారత్ గౌరవ్ అవార్డు, 1984లో పద్మభూషణ్, లక్ష్మీబాయి రాష్ట్రీయ సమ్మన్ మొదటి అవార్డు అందుకున్నారు.
Similar News
News February 6, 2026
సంపూర్ణ ఆహారం గొర్రెల పెరుగుదలకు ముఖ్యం

గొర్రెలకు మాంసకృత్తులు, క్రొవ్వు పదార్థాలు, ఖనిజ లవణాలు, పిండి పదార్థాలు, విటమిన్లతో కూడిన సంపూర్ణ దాణా(ఆహారం) అందేలా జాగ్రత్త వహించాలి. అప్పుడే గొర్రె మందలు ఆరోగ్యంగా పెరుగుతాయి. మంచి దాణా వల్ల గొర్రెల్లో పునరుత్పత్తి సామర్థ్యం పెరిగి వాటి మందలు వృద్ధిచెంది, పెంపకందారులకు అధిక ఆదాయం అందిస్తాయి. సరైన పోషకాహారం అందని తల్లి గొర్రెల వద్ద పిల్లలకు సరిపోను పాలుండకపోతే పిల్లలు సరిగా ఎదగక మరణిస్తాయి.
News February 6, 2026
పురుషాంగం సైజు పెంచుకుంటున్నట్లు ప్లేయర్లపై ఆరోపణలు

వింటర్ ఒలింపిక్స్ కోసం కొందరు స్కీ జంపర్స్ పురుషాంగం సైజు పెంచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. స్కీయర్స్కు శరీరం తాకి ఉండే టైట్ సూట్స్ కుట్టేందుకు 3D బాడీ స్కాన్ చేస్తారు. కొంచెం గ్యాప్ ఉన్నా గాలి చేరి తేలికై ఎక్కువ జంప్ చేయొచ్చు. దీంతో పెద్ద సూట్కై కొందరు ప్లేయర్స్ ఇంజెక్షన్లతో తాత్కాలికంగా సైజు పెంచుతున్నారని జర్మన్ మీడియా ఆరోపణ.
News February 6, 2026
‘సిగాచీ’ బాధితులకు రూ.కోటి ఇప్పిస్తే రాజీనామా చేస్తా: హరీశ్ రావు

TG: సిగాచీ ప్రమాద బాధితులకు CM రేవంత్ ₹కోటి చొప్పున పరిహారం ఇప్పిస్తే MLA పదవికి రాజీనామా చేస్తానని హరీశ్ రావు ప్రకటించారు. ‘సిగాచీ ప్రమాదంలో 54 మంది చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు. CM ₹కోటి పరిహారం ప్రకటించి ఒక్క రూపాయి ఇవ్వలేదు. KCR ఇచ్చిన పథకాలన్నీ బంద్ చేశాడు. పేగులు తీసి మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోలీలాడుతా అంటాడు. ఇదేనా CM మాట్లాడే భాష?’ అని సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ఫైరయ్యారు.


