News October 22, 2025
PDPL: అనుమానంతో మంచిర్యాలలో వివాహిత హత్య..!

భార్యను భర్త ఫ్లై ఓవర్ నుంచి కిందకు తోసేయగా ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఘటన మంచిర్యాల(D)లో జరిగింది. మందమర్రికి చెందిన కుమార్ PDPL(D) సుల్తానాబాద్(M) కనుకులకు చెందిన రజిత(30)ను 2013లో వివాహం చేసుకున్నాడు. పెళ్లైన ఏడాదికే భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో అత్తింటికి వెళ్లిన కుమార్ బంధువుల ఇంటికెళ్దామని ఆదివారం బైక్పై రజితను తీసుకెళ్లాడు. CCC సమీపంలోని ఫ్లైఓవర్ పైనుంచి భార్యను తోసేశాడు.
Similar News
News October 22, 2025
కరీంనగర్: షార్ట్ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు: CP

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు సంబంధించిన అంశాలపై షార్ట్ఫిల్మ్, ఫొటోగ్రఫీ పోటీలు నిర్వహిస్తున్నట్లు KNR CP గౌస్ ఆలం తెలిపారు. ప్రజలు రూపొందించిన షార్ట్ఫిల్మ్లు, ఇటీవల తీసిన ఫొటోలను నేటి నుంచి OCT 28 వరకు కమిషనరేట్ కార్యాలయంలోని ఐటీ కోర్ కార్యాలయంలో అందజేయాలని ఆయన సూచించారు. పోటీలలో ఉత్తమంగా నిలిచిన ముగ్గురిని ఎంపిక చేసి వారికి బహుమతులు అందజేయనున్నట్లు సీపీ వెల్లడించారు.
News October 22, 2025
కరీంనగర్: ‘నిరుద్యోగులకు జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు’

ఉమ్మడి కరీంనగర్ జిల్లా నిరుద్యోగులకు HYDలోని TOMCOM సంస్థ ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్ ప్లేస్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఈ కోర్సు మూడేళ్లు ఉంటుందని, శిక్షణ సమయంలో రూ. లక్ష స్టయిఫండ్తో పాటు, నర్సుగా ఉద్యోగంలో చేరిన తర్వాత సుమారు రూ. 3 లక్షల జీతం ఉంటుందని ఆయన వెల్లడించారు. మరిన్ని వివరాల కోసం 6302292450, 9440051763 నంబర్లలో సంప్రదించవచ్చు.
News October 22, 2025
వనపర్తి: గురుకులాల్లో మిగిలిన సీట్ల దరఖాస్తుకు రేపే లాస్ట్

జిల్లాలోని SC వెల్ఫేర్ గురుకులాల్లో ఖాళీగా ఉన్న 81 సీట్లు భర్తీ చేయనున్నట్లు ఇటీవల కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపిన విషయం తెలిసిందే. కాగా రేపటితో దరఖాస్తు గడువు ముగియనుంది. గురువారం సాయంత్రం 5 గంటల్లోపు కలెక్టరేట్లోని హెల్ప్ డెస్క్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఖాళీ సీట్ల భర్తీ కోసం TG CET ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. 5 నుంచి 9వ తరగతి వరకు ఖాళీ సీట్లు ఉన్నాయి.