News October 22, 2025

VZM: సీమంతం జరిగిన రెండో రోజే భర్త మృతి

image

గుర్ల మండలం కొండగండ్రేడుకు చెందిన పాపినాయుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. భార్య సీమంతం జరిగి రెండు రోజులు గడవకముందే ఈ విషాదం చోటుచేసుకుంది. అచ్యుతాపురం నుంచి తిరిగి వస్తూ మొక్కజొన్న కంకులు ఆరబెట్టిన రోడ్డుపై బైక్‌ అదుపుతప్పి పడిపోవడంతో బ్రెయిన్ డెడ్‌తో మృతి చెందాడు. గతంలో తండ్రి అప్పలనాయుడు కూడా ప్రమాదంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి మరణించాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Similar News

News October 22, 2025

తెర్లాంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

తెర్లాం మండలం చుక్కవలస వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నెమలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూనియర్ అసిస్టెంట్ కడమటి శ్రావణ్ కుమార్ మృతి చెందాడు. బండిపై ఆయన వెనుకున్న అటెండర్ రమణమ్మ తలకు గాయాలయ్యాయి. మరో బండిపై ఉన్న శివాజీకి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్‌ఐ సాగర్ బాబు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేశారు.

News October 22, 2025

VZM: ‘సర్దార్ @ 150 కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలి’

image

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “సర్దార్ @150” కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జరగనున్న ర్యాలీలు, పోటీల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.

News October 22, 2025

విజయనగరం ఉత్సవాలకు రూ.2.02 కోట్ల విరాళాలు: కలెక్టర్

image

విజయనగరం ఉత్సవాలకు 435 మంది దాతలు మొత్తం రూ.2.02 కోట్లు విరాళంగా అందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. వాటిలో రూ.1.41 కోట్లు ఉత్సవాల నిర్వహణకు వినియోగించగా.. మిగిలిన రూ.61 లక్షలు వచ్చే ఏడాది ఉత్సవాలకు ఉంచినట్లు ఆయన వివరించారు. 12 వేదికలపై సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ఉత్సవాల విజయానికి సహకరించిన దాతలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.