News October 22, 2025
రాఘవేంద్ర స్వామిని దర్శించిన మంత్రులు

మంత్రాలయం రాఘవేంద్ర స్వామిని బుధవారం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె.శివకుమార్, నీటిపారుదల శాఖ మంత్రి బోసురాజు, మంత్రి వాకిటి శ్రీహరి కలిసి దర్శించుకున్నారు. అనంతరం ఆలయ పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. అంతకుముందు మాంచాలమ్మ ఆలయంలో కార్తిక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Similar News
News October 25, 2025
అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.
News October 25, 2025
డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.
News October 25, 2025
సిరిసిల్ల: వ్యాధులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం.. మానక బుగ్గయ్య(80) టీబీ, షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన బక్కయ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఉప్పలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.


