News October 22, 2025

రాజకీయ లబ్ధికే ప్రభుత్వ ఆస్పత్రులపై దుష్ప్రచారం: రాజనర్సింహ

image

రాజకీయ లబ్ధి కోసమే కొందరు ప్రభుత్వ ఆస్పత్రులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దామోదర రాజనర్సింహ బుధవారం తెలిపారు. బస్తీ దవఖానాలో ద్వారా ప్రతిరోజు 45 వేల మందికి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. తప్పుడు ప్రచారం చేసే వారికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు. డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 134 రకాల టెస్టులు ఉచితంగా అందిస్తున్నట్లు వివరించారు.
దుష్పచారం

Similar News

News October 25, 2025

అతనెవరు.. తెలిస్తే చెప్పండి: కలెక్టర్

image

కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మరణించిన గుర్తుతెలియని వ్యక్తిని గుర్తిస్తే కంట్రోల్ రూమ్ 08518 277305కు ఫోన్ చేసి తెలపాలని కలెక్టర్ డా.ఏ.సిరి పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన బస్సులో హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో ఎక్కినట్లు తెలిసిందన్నారు. అతని పేరు ప్రయాణికుల జాబితాలో లేదని తెలిపారు. వయసు 50 ఏళ్లు ఉండవచ్చని, అతని వివరాలు తెలిస్తే తెలపాలని కోరారు.

News October 25, 2025

డ్రగ్స్, గంజాయిని అరికట్టాలి: కలెక్టర్

image

జిల్లాలో డ్రగ్స్, గంజాయిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అధికారులను కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం వివిధ శాఖల అధికారులతో డ్రగ్స్, గంజాయి నియంత్రణ చర్యలపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రాణాంతకమైన డ్రగ్స్, గంజాయిని అందరూ కలిసికట్టుగా నిర్మూలించాలని పిలుపునిచ్చారు.

News October 25, 2025

సిరిసిల్ల: వ్యాధులతో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య

image

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో వృద్ధుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గణేష్ వివరాల ప్రకారం.. మానక బుగ్గయ్య(80) టీబీ, షుగర్, బీపీ వ్యాధులతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైన బక్కయ్య ఇంట్లో ఎవరూలేని సమయంలో గురువారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కొడుకు ఉప్పలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు.