News October 22, 2025

అధికారంలోకి రాగానే బల్క్ డ్రగ్‌ పార్కు రద్దు చేస్తాం: బొత్స

image

AP: అనకాపల్లి(D) రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న మత్స్యకారులకు అండగా ఉంటామని YCP MLC బొత్స సత్యనారాయణ అన్నారు. ‘ఆందోళన చేస్తున్న మత్స్యకారులు సంఘ విద్రోహ శక్తులా? వారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బల్క్ డ్రగ్‌ పార్కును రద్దు చేస్తాం. త్వరలో జగన్ రాజయ్యపేటలో పర్యటిస్తారు’ అని స్పష్టం చేశారు.

Similar News

News October 24, 2025

శివ పూజలో ఈ పత్రాలను వాడుతున్నారా?

image

పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన మారేడు దళాలను శివ పూజలో వినియోగించడం ఎంతో శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. త్రిదళాలుగా పిలిచే ఈ ఆకులు శివుడి త్రిగుణాతీత స్వరూపానికి, 33 కోట్ల దేవతలకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శివాలయాలలో నిత్యం బిల్వార్చనలు చేస్తారు. పురాణాల ప్రకారం.. కేవలం మారేడు దళాలను శివలింగానికి అర్పించడం ఎంతో పుణ్యం పుణ్యమట. ఫలితంగా అద్భుతమైన శుభ ఫలితాలను ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి.

News October 24, 2025

దీపావళికి వచ్చి వెళ్తుండగా సజీవదహనం

image

కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువతి సజీవదహనం అయ్యారు. యాదాద్రి జిల్లా గుండాల మం. వస్తకొండూరుకు చెందిన అనూష బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. దీపావళికి ఇంటికి వచ్చిన ఆమె.. నిన్న రాత్రి బెంగళూరు వెళ్లేందుకు ఖైరతాబాద్‌లో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కారు. బస్సు దగ్ధమైన ఘటనలో ఆమె సజీవదహనం అయ్యారు. దీంతో అనూష పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు.

News October 24, 2025

IGMCRIలో 226 నర్సు పోస్టులు

image

ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ& రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ 226 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. నర్సింగ్ డిగ్రీ, డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్, మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు NOV 6వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 -35ఏళ్ల మధ్య ఉండాలి. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.250, SC, STలకు రూ.125. <>వెబ్‌సైట్<<>>: https://igmcri.edu.in/