News October 22, 2025
కరీంనగర్: రేపే లాస్ట్ డేట్.. 27న డ్రా

కరీంనగర్ జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్స్ కోసం అక్టోబర్ 23న లాస్ట్ డేట్ అని, రూ.3 లక్షల రూపాయల డీడీ చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీనివాస రావు తెలిపారు. నిన్నటి వరకు 2,639 దరఖాస్తులు వచ్చినట్లు తెలియజేశారు. ఆసక్తి గలవారు అప్లికేషన్స్ సమర్పించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం మద్యం దుకాణాలకు లైసెన్స్లను ఈనెల 27న నిర్వహించే లాటరీ ద్వారా దక్కించుకోవాలని సూచించారు.
Similar News
News October 24, 2025
KNR: విద్యార్థులకు పోలీసు భద్రతా అవగాహన

పోలీసు అమర వీరుల సంస్కరణ వారోత్సవాలను పురస్కరించుకొని ఇవాళ పోలీసు పరేడ్ గ్రౌండ్లో పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ.. పోలీసు వ్యవస్థ పనితీరు, డిపార్టుమెంట్లో ఉపయోగించే ఆయుధాలు, సాంకేతిక పద్దతులు తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిరు.
News October 24, 2025
KNR: గదిలో గంజాయి దాచి.. స్నేహితులతో సేవించి

కరీంనగర్ బ్యాంక్ కాలనీలో గంజాయి నిలువచేసి వినియోగిస్తున్న చిక్కులపల్లి సాయివిఘ్నేశ్ అనే యువకుడిని పట్టుకొని రిమాండ్ చేసినట్లు 3టౌన్ పోలీసులు తెలిపారు. లంబసింగి ప్రాంతం నుంచి 2కిలోల గంజాయి కొనుగోలు చేసి, తన ఇంటి టెర్రస్పై చిన్న గదిలో దాచిపెట్టి, తరచూ తన స్నేహితులతో కలిసి సాయివిఘ్నేశ్ గంజాయి సేవిస్తున్నాడని చెప్పారు. నమ్మదగిన సమాచారం మేరకు నిందితుడితోపాటు గంజాయిని నిన్న పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
News October 24, 2025
JMKT: నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

జమ్మికుంట పత్తి మార్కెట్లో నేటి నుంచి CCI ద్వారా పత్తి కొనుగోళ్లను ప్రారంభించనున్నట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తిలో తేమ శాతం 8 నుంచి 12 వరకు ఉండేలా చూసుకోవాలన్నారు. అలా అయితేన్ మద్దతు ధర పొందవచ్చన్నారు. CCI ద్వారా పత్తి అమ్ముకునే రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్లో స్లాట్ బుక్ చేసుకొని కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాలన్నారు. సమస్యలుంటే 18005995779, వాట్సాప్ నంబర్ 8897281111లను సంప్రదించండి.


