News October 22, 2025
కార్తీక మాసం: తొలి రోజున ఏం చేయాలంటే?

కార్తీక మాసంలో తొలి రోజు చాలా పవిత్రమైంది. ఈ శుభారంభం రోజున తెల్లవారుజామునే నిద్ర లేచి, స్నానం చేసి శుచిగా ఉండాలి. సమీపంలోని దేవాలయానికి వెళ్లి, శివుడిని దర్శించుకోవాలి. అక్కడ కార్తీక వ్రతం పాటించాలని సంకల్పం చెప్పుకోవాలి. నెల రోజుల పాటు ఈ వ్రతాన్ని ఆటంకాలు లేకుండా పూర్తి చేసేలా భగవంతుడిని ప్రార్థించాలి. అనంతరం ఆలయంలో ఉంచే ఆకాశదీపాన్ని దర్శించుకోవడం మంచి ఆచారం. దీనివల్ల శుభం కలుగుతుందని నమ్మకం.
Similar News
News October 25, 2025
కెప్టెన్ను బోర్డు కన్సల్టెంట్గా నియమించిన పాక్

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
News October 25, 2025
జర్నలిస్టులకు స్థలాలిచ్చి ఇళ్లు నిర్మిస్తాం: మంత్రి పార్థసారథి

AP: పేదలందరికీ ఇళ్లు, స్థలాలివ్వాలని నిర్ణయించినట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. అర్హులైన వారందరికీ 2, 3 సెంట్లు స్థలాలు ఎలా ఇవ్వాలో GOM భేటీలో చర్చించామన్నారు. జర్నలిస్టులకు స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలనేది తమ ప్రభుత్వ విధానమని తెలిపారు. అయితే SC తీర్పు ఉన్న నేపథ్యంలో లీగల్గా ఉన్న అడ్డంకులను అధిగమించేందుకు అడ్వకేట్ జనరల్ అభిప్రాయం అడుగుతామని మంత్రి వివరించారు.


