News October 22, 2025

KPHBలో ఫ్రెండ్స్‌తో డిన్నర్.. యువకుడి మృతి

image

ఫ్రెండ్స్‌తో డిన్నర్ చేయడానికి వెళ్లిన యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన KPHB PS పరిధిలో చోటుచేసుకుంది. భవన్ కుమార్(24) KPHB రోడ్డు 3లో గణేష్ హాస్టల్‌లో నివాసం ఉంటూ జాబ్ చేస్తున్నాడు. 21వ తేదీన 8 గంటల సమయంలో PNR ఎంపైర్ భవనంలో తినడానికి వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. వెంటనే స్నేహితులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 26, 2025

NZB: ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య

image

నిజామాబాద్‌లో ప్రేమలో విఫలమైందని ఓ యువకుడు ఉరేసుకుని బలవన్మరణం చెందినట్లు నాలుగో టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. డిచ్‌పల్లి మండలం గొల్లపల్లికి చెందిన ఆకాష్ NZBలోని ఓ మాల్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తూ వినాయక్ నగర్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ఉన్న యువతితో ప్రేమాయణం కొనసాగించాడు. ప్రేమ విషయం వారి ఇంట్లో తెలిసి గొడవలు జరగాయి. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

News October 26, 2025

పిక్నిక్ స్పాట్‌గా రేవు పోలవరం

image

కార్తీక మాసం వచ్చిందంటే అందరి చూపులు రేవు పోలవరం వైపే ఉంటాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో రేవు పోలవరం పిక్నిక్ స్పాట్‌గా గుర్తింపు పొందింది. విశాలమైన సముద్ర తీరం, దానికి అనుకుని పురాతనమైన రాధా మాధవ స్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సముద్రం మధ్యలో నిర్మించిన జెట్టి, కొబ్బరి తోటలతో ఆహ్లాదకరమైన వాతావరణ కనువిందు చేస్తాయి. దూర ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చి ఆనందంగా గడిపి వెళుతుంటారు.

News October 26, 2025

కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థుల ఫీజులు ఇవే..!

image

కేయూలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు సామాజిక వర్గాల వారీగా హాస్టల్స్ డిపాజిట్లను నిర్ణయించారు. ఓసీ కేటగిరీ అభ్యర్థులు రూ.12,200, బీసీ కేటగిరి అభ్యర్థులు రూ.10,200, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.8,200 చెల్లించాల్సి ఉంది. అన్ని కేటగిరీలకు చెందిన దివ్యాంగులు ఎలాంటి ఫీజులు చెల్లించనవసరం లేదని డైరెక్టర్ తెలిపారు.