News October 22, 2025
ఎల్లారెడ్డిపేట: ద్విచక్ర వాహనం బోల్తా.. మహిళ దుర్మరణం

ఎల్లారెడ్డిపేట(M) అక్కపెళ్లిలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందింది. కొనరావుపేట(M) సుద్దాలకు చెందిన దొబ్బల మరియమ్మ (55), తన రెండో కుమారుడు ప్రభాకర్తో కలిసి అల్మాస్పూర్లో బంధువులు చనిపోతే పరామర్శకు వెళ్తుంది. బుగ్గ రామేశ్వరం లింగం గుట్ట వద్దకు రాగానే మూలమలుపు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో మరియమ్మ కింద పడింది. ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందింది. మరిన్ని వివరాలు తెలియాలి.
Similar News
News October 25, 2025
అక్టోబర్ 25: చరిత్రలో ఈరోజు

1921: సంగీత దర్శకుడు టి.వి.రాజు జననం
1962: గేయ రచయిత కలేకూరి ప్రసాద్ జననం
1968: సినీ నటుడు సంపత్ రాజ్ జననం
1999: సంగీత దర్శకుడు సాలూరు రాజేశ్వరరావు మరణం(ఫొటోలో)
1951: దేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభం
* అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
News October 25, 2025
కెప్టెన్ను బోర్డు కన్సల్టెంట్గా నియమించిన పాక్

పాక్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటన చర్చనీయాంశంగా మారింది. తమ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్ను ఇంటర్నేషనల్ క్రికెట్ & ప్లేయర్స్ అఫైర్స్ కన్సల్టెంట్గా నియమించింది. ఇది చాలా అరుదైన, ఆశ్చర్యకర నిర్ణయమని క్రీడావర్గాలు చెబుతున్నాయి. కెప్టెన్గా ఉన్న వ్యక్తికి బోర్డు అడ్మినిస్ట్రేటివ్ సెటప్లో స్థానం కల్పించడం ఇదే తొలిసారని అంటున్నారు. ఇలాంటి నిర్ణయాలు పాక్కే సాధ్యమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
News October 25, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి


