News October 22, 2025
మేడారం జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి: సబ్యసాచి ఘోష్

మేడారం మహాజాతర ఏర్పాట్లపై గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి ఘోష్ సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర విజయవంతంగా జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీపీ శ్రీ మహేశ్ భగత్, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 23, 2025
సిరిసిల్ల: ‘అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం’

పోలీస్ అమరవీరుల త్యాగాలు స్ఫూర్తిదాయకమని అదనపు ఎస్పీ చంద్రయ్య అన్నారు. సిరిసిల్లలోని పోలీస్ స్టేషన్ లో బుధవారం ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులకు పోలీసుల పనితీరు, ఆయుధాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సీఐ కృష్ణ, ఆర్ఐ యాదగిరి, ఎస్సైలు శ్రవణ్, దిలీప్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 23, 2025
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల

AP: ఉపాధి హామీ పథకానికి మెటీరియల్ కాంపోనెంట్ కింద 2025–26 ఏడాదికి మొదటి విడతగా కేంద్రం రూ.665 కోట్లు విడుదల చేసింది. ఈ మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.166 కోట్లు జత చేసింది. రాష్ట్రంలో పంచాయతీ భవనాల నిర్మాణం, రికార్డులు కంప్యూటరీకరణ, ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ నిమిత్తం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్(RGSA) ద్వారా రూ.50 కోట్లు నిధులు విడుదల చేసింది. వీటికి రాష్ట్రం రూ.33 కోట్లు జత చేయనుంది.
News October 23, 2025
తిరుపతి: రేపు స్కూళ్లకు సెలవు

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కలెక్టర్ ఆదేశాల మేరకు గురువారం అనగా 23వ తేదీన జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ప్రైవేట్ (Unaided) పాఠశాలలకు, అంగన్ వాడీలకు, జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటించడం జరిగిందని డీఈఓ కేవీఎన్ కుమార్ తెలిపారు. డివైఈఓలు, ఎంఈఓలు, HMలు తమ పరిధిలోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఈ సమాచారాన్ని వెంటనే తెలియజేయవలసిందిగా ఆదేశించారు.