News October 22, 2025

‘చింతలపూడిలో మౌలిక వసతులను కల్పించండి’

image

చింతలపూడి MLA సొంగా రోషన్ జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని కోరారు. చింతలపూడి, లింగపాలెం మండలాలను ఏలూరు రెవెన్యూ డివిజన్‌లో కలపాలని అన్నారు. రహదారుల అభివృద్ధి, ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టాలని కోరారు. తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు గుత్తా వేంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 25, 2025

నా కొడుకు వ్యాఖ్యలను వక్రీకరించారు: సిద్దరామయ్య

image

తన రాజకీయ జీవితంపై కొడుకు యతీంద్ర చేసిన <<18075196>>వ్యాఖ్యలను<<>> వక్రీకరించారని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కాబోయే సీఎం ఎవరనే విషయమై కాకుండా విలువల గురించి తన కొడుకు మాట్లాడారని పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యాఖ్యలపై తాను ఇప్పుడే స్పందించనని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయమై ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడతానని చెప్పారు.

News October 25, 2025

బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్‌

image

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రోగుల ఆరోగ్య భద్రత, పర్యావరణ పరిరక్షణకు ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని ఆయన అన్నారు.

News October 25, 2025

KMR: అక్టోబర్ 27న లాటరీ

image

కామారెడ్డి జిల్లాలో 49 వైన్స్ షాప్ లైసెన్సుదారుల ఎంపిక కోసం డ్రా ప్రక్రియ OCT 27న నిర్వహించనున్నట్లు ES హనుమంత్ రావు తెలిపారు. ఈ డ్రా OCT 27న ఉ.11 గంటలకు కామారెడ్డిలోని రేణుకా దేవి కళ్యాణ మండపంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సమక్షంలో జరుగుతుందన్నారు. ఉ.9:30 గంటలకల్లా తమ హాల్ టికెట్‌తో హాజరుకావాలన్నారు. లాటరీలో ఎంపికైన లైసెన్సుదారులు ఫీజులో 1/6వ వంతు చెల్లించాల్సి ఉంటుందని ES పేర్కొన్నారు.