News October 22, 2025
NGKL: స్థానిక సంస్థల ఎన్నికలపై నాయకులలో మళ్లీ ఉత్కంఠ

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నామినేషన్ల వరకు వచ్చి నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈనెల 23న స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రివర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నందున నాయకులలో మళ్లీ ఉత్కంఠ మొదలైంది. ఎన్నికలలో పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాయకులు ఎన్నికల కోసం ఎదురుచూస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లాలో 20 జడ్పీటీసీ, ఎంపీటీసీ 214, సర్పంచ్ 460 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Similar News
News October 25, 2025
అన్ని కార్తెలు తప్పినా హస్త తప్పదు

కార్తెల(నక్షత్రాలు) ప్రకారం రైతులు వర్షాన్ని అంచనా వేసేవారు. వర్షం కురిసే సీజన్కు సంబంధించిన అన్ని కార్తెలు తప్పిపోయినా, హస్త సమయంలో వర్షం తప్పకుండా పడుతుంది అనే నమ్మకాన్ని ఇది సూచిస్తుంది. సీజన్లో కురవాల్సిన వాన మిగతా కార్తెల్లో పడకపోయినా హస్తలో కచ్చితంగా పడుతుందని ఓ నమ్మకం. అందుకే రైతులు ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతుంటారు.
(మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి)
News October 25, 2025
‘బెల్ట్’ దందా.. ముందరుంది మేడారం జాతర..!

ములుగు జిల్లాలోని కొన్ని వైన్ షాప్లకు క్రేజ్ కొనసాగుతోంది. సమీపంలో మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరుండటం, బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుండడంతో దుకాణాలను దక్కించుకునేందుకు సిండికేట్ వ్యాపారులు పోటీ పడ్డారు. జంగాలపల్లి షాపునకు 61 దరఖాస్తులు, మల్లంపల్లి 77, ఏటూరునాగారంలోని మూడు దుకాణాలకు 48, 49, 42, రామన్నగూడెం షాపునకు 48 దరఖాస్తులు వచ్చాయి. మేడారంలోని మూడు దుకాణాలకు 11, 12, 13 చొప్పున డీడీలు పడ్డాయి.
News October 25, 2025
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ఖర్గేతో భేటీ!

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ చీఫ్ ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకాలపై అధిష్ఠానం సీఎం అభిప్రాయాలను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రుల మధ్య విభేదాలు, అంతర్గత అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరు కల్లా డీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశముంది.


