News April 9, 2024

ప్రకాశం: పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

అనారోగ్యంతో వృద్ధుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తాళ్లూరు పట్టణములోని కన్యకాపరమేశ్వరి ఆలయం సమీపంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కోటారామిరెడ్డి (75) కొంతకాలంగా నరాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగాడు. ఇరుగుపొరుగువారు గమనించి ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 30, 2024

పింఛన్లపై ప్రకాశం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ఆదివారం స్థానిక కలెక్టరేట్‌లో ప్రకాశం జిల్లాలోని అన్ని మండలాల అధికారులతో కలెక్టర్ తమీమ్ అన్సారియా అక్టోబర్ 2024కి సంబంధించి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల ప్రత్యేక అధికారులు, డీఎల్‌డీఓలు, ఎంపీడీఓలు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 1న పెన్షన్ పంపిణీ 100 శాతం పంపిణీ చేయాలన్నారు.

News September 29, 2024

ప్రకాశం జిల్లాలో నూతన ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లు వీరే

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పలు ఎక్సైజ్ శాఖ స్టేషన్లకు ఇన్‌స్పెక్టర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
➤ ఒంగోలు – A. లినా
➤ మార్కాపురం – వెంకటరెడ్డి
➤ చీమకుర్తి – M. సుకన్య
➤ సింగరాయకొండ – M. శివకుమారి
➤ పొదిలి – T. అరుణకుమారి
➤ దర్శి – శ్రీనివాసరావు
➤ కనిగిరి – R. విజయభాస్కరరావు
➤ గిద్దలూరు – M. జయరావు
➤ కంభం – కొండారెడ్డి
➤ యర్రగొండపాలెం – CH శ్రీనివాసులు
➤ కందుకూరు – వెంకటరావు

News September 29, 2024

బూచేపల్లి బాధ్యతల స్వీకరణకు.. డేట్ ఫిక్స్.!

image

ప్రకాశం జిల్లా వైసీపీ నూతన అధ్యక్షులుగా నియమితులైన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్టోబర్ 4 ఉదయం 10 గంటలకు, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రకాశం జిల్లాలోని వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైసీపీ కార్యాలయ ప్రతినిధులు ఆదివారం తెలిపారు.