News October 22, 2025
శ్రీలంక నేతను కాల్చి చంపేశారు

శ్రీలంక దేశం వెలిగామా కౌన్సిల్ ఛైర్మన్, ప్రతిపక్ష సమాగి జన బలవేగయ పార్టీ నేత లసంత విక్రమశేఖర(38) దారుణ హత్యకు గురయ్యారు. తన ఆఫీసులో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న సమయంలో ఇద్దరు దుండగులు కాల్పులు జరిపి పరారయ్యారు. విక్రమశేఖరను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News October 23, 2025
మేడ్చల్ ఘటనపై బండి సంజయ్ ఫైర్

TG: గోరక్షాదళ్ సభ్యుడు సోనూసింగ్పై <<18077269>>దాడిని<<>> కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఖండించారు. ఎంఐఎం రౌడీలకు కాంగ్రెస్ ఆశ్రయం ఇస్తే ఇలాంటి ఘటనలే జరుగుతాయని ధ్వజమెత్తారు. గోభక్తులపై దాడులకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. మరోవైపు దాడిని వ్యతిరేకిస్తూ ఇవాళ డీజీపీ ఆఫీసు ఎదుట నిరసన చేపట్టనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్చందర్ రావు తెలిపారు.
News October 23, 2025
అక్టోబర్ 23: చరిత్రలో ఈరోజు

1922: రచయిత అనిశెట్టి సుబ్బారావు జననం
1923: మాజీ ఉపరాష్ట్రపతి బైరాన్సింగ్ షెకావత్ జననం
1979: సినీ హీరో ప్రభాస్ జననం
1991: హీరోయిన్ చాందిని చౌదరి జననం
2007: ప్రముఖ తెలుగు కవి ఉత్పల సత్యనారాయణాచార్య మరణం
2023: భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడి మరణం
News October 23, 2025
ఆస్ట్రేలియన్ ప్లేయర్ రికార్డు సెంచరీ

ఆస్ట్రేలియన్ ప్లేయర్ గార్డ్నర్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. WWCలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ప్లేయర్గా నిలిచారు. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచులో 69 బంతుల్లోనే 15 ఫోర్లతో శతకం బాదారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఛేదనలో గార్డ్నర్(104*), అన్నాబెల్(98*) విజృంభించడంతో ఆస్ట్రేలియా 40.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.