News October 23, 2025

అద్దంకి ప్రకాశం జిల్లాలో కలవనుందా.?

image

బాపట్ల జిల్లా నుంచి అద్దంకిని ప్రకాశం జిల్లాలో తిరిగి విలీనం చేసే అంశంపై సీసీఎల్ఏ ఆధ్వర్యంలో వీక్షణ సమావేశం జరిగింది. అద్దంకి సరిహద్దులపై రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని, విడదీసినప్పటి ప్రభావంపై అధ్యయనం చేయాలని సూచించారు. వర్షాభివృద్ధి హెచ్చరికలు, నీటి-మట్టి పరిశీలనలు, అర్జీల పరిష్కారం, గృహాల కేటాయింపు ప్రణాళికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. డీఆర్ఓ, కలెక్టర్, ఆల్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 23, 2025

ADB: అవినీతీ.. చెక్‌పొస్టులు క్లోజ్

image

రాష్ట్రంలోని చెకోపోస్టుల్లో భారీగా అవినీతి జరుగుతోంది. ఇటీవల ఏసీబీ అధికారులు భోరజ్, బెల్తారోడా, వాంకిడి ఆర్టీఏ చెక్‌పోస్టులపై దాడులు చేపట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో అవినీతికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం అన్ని చెక్‌పోస్టులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్తున్న అనుమతులు ఇక నుంచి ఆన్‌లైన్ ద్వారాఇవ్వనుంది. రవాణాశాఖ నిరంతరం పర్యవేక్షించనుంది.

News October 23, 2025

మైలవరంలో రేపు జాబ్ మేళా రద్దు

image

మైలవరం పట్టణ పరిధిలోని లక్కిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు (అక్టోబర్ 24) జరగవలసిన మెగా జాబ్ మేళాను ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దు చేస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కార్యాలయం వారు తెలిపారు. తిరిగి ఈ మెగా జాబ్ మేళాను ఈ నెల 31వ తేదీన నిర్వహిస్తున్నట్లు వారు ప్రకటించారు. కావున నిరుద్యోగులు అందరూ గమనించవలసిందిగా కోరారు.

News October 23, 2025

రంగారెడ్డి: బెగ్గింగ్ చేసి మరీ బోర్ రిపేర్!

image

తమ హయాంలో ఎంతో అభివృద్ధి జరిగిందని పాలకులు చెబుతుంటారు. ఇది సాదారణమే కానీ, తండాల్లో చిన్న సమస్య వస్తే GPల్లో నిధులు లేని దుస్థితి కనిపిస్తోంది. అవును.. తలకొండపల్లి మం. హర్యానాయక్ తండాలో నీటి మోటరు కాలిపోయింది. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు లేవని సమాధానం వచ్చింది. దీంతో నీటి సమస్య తీర్చాలని కొందరు యువకులు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేశారు. జమ అయిన రూ.5000తో బోరు రిపేర్ చేయించడం గమనార్హం.