News October 23, 2025
మానవపాడు: ఇసుక అక్రమ రవాణా చేస్తే రూ.50 వేల ఫైన్

ఏపీ నుంచి తెలంగాణలోని గ్రామాలవైపు అక్రమంగా ఇసుకను తరలించే వాహనాలు ఏవైనా పట్టుపడితే కేసులు, ఫైన్లు తప్పనిసరి వేస్తున్నామని తహశీల్దార్ జోషి శ్రీనివాస్ రావు అన్నారు. ఈ నెల 9న ఏపీలోని తాడిపత్రి నుంచి ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను ఎస్సై చంద్రకాంత్ పట్టుకొని కేసు నమోదు చేశారు. అట్టి వాహనాలకు ఒక్కొక్క వాహనంకు రూ.50 వేల ఫైన్ వేశామని, రెండోసారి వాహనం ఇసుకను రవాణా చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు.
Similar News
News October 23, 2025
391 కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేశారా?

BSF స్పోర్ట్స్ కోటాలో 391 కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఇంటర్ విద్యార్హతతోపాటు నేషనల్, ఇంటర్నేషన్ గేమ్స్లో రాణించిన వారు అర్హులు. వయసు 18-23ఏళ్లు ఉండాలి. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంది. దరఖాస్తుకు ఆఖరు తేదీ నవంబర్ 4. PST, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్, స్పోర్ట్స్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక ఉంటుంది. వెబ్సైట్: https://rectt.bsf.gov.in/
News October 23, 2025
ఏపీలో 23 ఉద్యోగాలు

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో 23 ఉద్యోగాలకు షార్ట్ నోటిఫికేషన్ వెలువడింది. బోధన కేటగిరీలోని 10 విభాగాల్లో, బోధనేతర కేటగిరీలోని 10 విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలను త్వరలో https://nsktu.ac.in వెబ్సైట్లో పొందుపరుస్తారు. దరఖాస్తులకు నవంబర్ 30 ఆఖరు తేదీ.
News October 23, 2025
పోచారంలో కాల్పులు.. CP క్లారిటీ

పోచారంలో కాల్పుల ఘటనపై రాచకొండ CP సుధీర్ బాబు క్లారిటీ ఇచ్చారు. పాతకక్షల కారణంగా జరిగిన దాడి అంటూ స్పష్టం చేశారు. ‘ప్రశాంత్ చెప్పిన ప్లేస్ అయిన టీ స్టాల్ వద్దకు ఇబ్రహీం, మోసిన్, శ్రీనివాస్ వచ్చారు. ఇంతకుముందే వీళ్లకు ఇంటరాక్షన్ ఉంది. ఇబ్రహీంకు ప్రశాంత్ వల్ల రూ.కోటి నష్టం జరిగింది. ఇదే బుధవారం సాయంత్రం కాల్పులకు దారి తీసింది. నిందితులను అరెస్ట్ చేశాం. ఒకరు పరారీలో ఉన్నారు’ అని CP తెలిపారు.