News October 23, 2025
జనగామ: మద్యం టెండర్లు.. 1,600 దరఖాస్తులు!

మద్యం టెండర్ల గడువు నేటితో ముగియనుంది. ఈనెల 18 వరకు ఉన్న గడువును ఎక్సైజ్ శాఖ ఈనెల 23 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఐదు రోజుల గడువు పొడిగింపుతో మరికొందరు దరఖాస్తు చేసుకున్నారు. జనగామ జిల్లాలో ఇప్పటివరకు 1600కు పైగా దరఖాస్తులు వచ్చాయని విశ్వసనీయ సమాచారం. ఇంకెవరైనా టెండర్లకు దరఖాస్తు చేసుకోవాలని ఉంటే ఈరోజు ఒక్క మాత్రమే అవకాశం ఉంది.
Similar News
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.
News October 23, 2025
మెడికల్ కళాశాలను సందర్శించిన కలెక్టర్

వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని R&B అధికారులను ఆదేశించారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్లో నో బ్యాలెట్.. ఓన్లీ EVM!

EVMల ద్వారానే జూబ్లీహిల్స్ బైపోల్ నిర్వహిస్తామని HYD జిల్లా ఎన్నికల అధికారి RV కర్ణన్ స్పష్టం చేశారు. నామినేషన్ల పరిశీలన పూర్తి చేసిన అనంతరం 81 మంది అభ్యర్థులకు ఆమోదం లభించింది. రేపు ఉపసంహరణకు అవకాశం ఉంది. ఇంకెవరైనా ఉపసంహరణకు వెళితే అభ్యర్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. అయితే, 64 మందికి పైగా పోటీలో ఉంటే M3 ఈవీఎంలు ఉపయోగించనున్నారు.