News October 23, 2025
నంగునూర్: కొనుగోలు కేంద్రాలపై కోతుల దండయాత్ర

నంగునూర్ మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలపై కోతులు గుంపుగా దండెత్తుతున్నాయి. వడ్ల రాశులపై కోతుల గుంపులు దండెత్తి ధాన్యాన్ని తినివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన రైతులపై దాడి చేస్తుండటంతో మహిళలు, చిన్నారులు భయపడుతున్నారు. కోతుల బెడద నుంచి కాపాడాలని, మార్కెట్ సిబ్బంది తక్షణమే చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Similar News
News October 23, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
News October 23, 2025
జిల్లాలో మూడు చోట్ల వ్యాసరచన, వక్తృత్వ పోటీలు: DEO

పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవం పురస్కరించుకొని జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు చోట్ల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో సుబ్రహ్మణ్యం తెలిపారు. 8 నుంచి టెన్త్ విద్యార్థులు దేశభక్తి, సామాజిక బాధ్యత, చట్టాలు అనే అంశాలపై వ్యాసరచన అద్భుత పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాయచోటి డైట్ కళాశాల, మదనపల్లి జడ్పీ హై స్కూల్, రాజంపేట గర్ల్స్ హైస్కూల్లో పోటీలు నిర్వహిస్తామన్నారు.
News October 23, 2025
GNT: భారీ వర్షాలకు అప్రమత్తమైన అధికార యంత్రాంగం

తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లాలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ తమీమ్ అన్సారియా గురువారం ఉదయం నుంచి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకస్మిక వరదల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేయాలని, చెట్లు, భారీ హోర్డింగ్లు, శిథిల భవనాల వద్ద ఉంచవద్దని సూచించారు. అత్యవసరమైతే గుంటూరు కలెక్టరేట్ నెంబర్ 08632234990కు సమాచారం ఇవ్వాలని సూచించారు.