News October 23, 2025
ఖమ్మం: 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులు మూసివేత

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA)కి చెందిన 3 అంతర్రాష్ట్ర చెక్పోస్టులను అధికారులు తొలగించారు. పాల్వంచలో 35 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసి, 2010లో నాగారం కాలనీకి తరలించిన చెక్పోస్టును మూసివేశారు. అశ్వారావుపేటలో 2014లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుతో పాటు, సత్తుపల్లి మండలంలోని ముత్తుగూడెం చెక్పోస్టును కూడా తొలగించారు.
Similar News
News October 23, 2025
సముద్ర మట్టం పెరిగితే 282 గ్రామాలు ముంపు

AP: దేశంలో తుఫాన్లు, వరదలు వంటి విపరీత వాతావరణ పరిస్థితులు ఎదురయ్యే ప్రాంతాల్లో ఏపీ ఒకటి. వీటివల్ల ఏటా ప్రాణ, ఆస్తి నష్టమూ ఎక్కువే. సముద్ర మట్టం పెరుగుదలతో రానున్నకాలంలో ఏపీలోని 282 తీర గ్రామాలు ముంపుబారిన పడొచ్చని తాజాగా అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో 10L మందిని తరలించాల్సి రావచ్చంటున్నారు. ఇప్పటికే 32% తీరప్రాంతం కోతకు గురవుతున్నట్లు గుర్తించిన GOVT దీన్ని ఎదుర్కోవడానికి చర్యలు చేపడుతోంది.
News October 23, 2025
చిన్నారులకు నాన్వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. ఆరునెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డును, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి వాటిని పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.
News October 23, 2025
హుజూర్నగర్ జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలన

ఈ నెల 25న హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ సారథ్యంలో జరగనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లను కలెక్టర్ నందలాల్ పవార్, ఎస్పీ నరసింహ పరిశీలించారు. ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి వారు ఏర్పాట్లను సమీక్షించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. మార్కెట్ ఛైర్మన్, ఇతర నాయకులు పాల్గొన్నారు.