News October 23, 2025
రాజేంద్రనగర్లోని NIRDPRలో ఉద్యోగాలు

రాజేంద్రనగర్లోని NIRDPRలో పని అనుభవం ఉన్నవారికి ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. UG, PG, PHD చేసి, అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. రూ.50 వేల జీతంతో రీసెర్చ్ అసోసియేట్ 8 పోస్టులు, సీనియర్ ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ఒక పోస్టుకు రూ.లక్ష వేతనం ఇవ్వనున్నారు. ఈ 9 ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిక్ కింద భర్తీ చేస్తారు. R.Aకు 50 ఏళ్లు, SPCకి 65 ఏళ్లు మించొద్దు. OCT 29న వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
SHARE IT
Similar News
News October 23, 2025
BREAKING: HYD: విషాదం.. ఇంటర్ విద్యార్థి మృతి

ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్ పరిధి యమ్నంపేట్లోని ఓ ప్రైవేట్ కాలేజీ బిల్డింగ్ నాలుగో అంతస్తు నుంచి ఇంటర్ విద్యార్థి అభిచేతన్ రెడ్డి(17) పడ్డాడు. అతడిని మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్కి తరలించగా అప్పటికే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. డెడ్బాడీని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కాగా అతడు దూకాడా?, ఎవరైనా తోశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెసోళ్లను నిలదీయండి: KCR

పేద గర్భిణులకు మానవీయ కోణంలో అందిస్తోన్న KCR కిట్ పథకాన్ని ఎందుకు ఆపేశారో కాంగ్రెసోళ్లను జూబ్లీహిల్స్ ప్రజలు నిలదీయాలని మాజీ CM KCR పిలుపునిచ్చారు. యాదవులకు అందిస్తోన్న గొర్రెల పంపిణీ పథకాన్ని ఎందుకు రద్దు చేశారో, చేపల పంపిణీ ఎందుకు దిగమింగారో ఓటు అడిగేందుకు ఇంటి ముందుకు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థిని అడగాలని KCR కోరారు. పథకాలపై ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
News October 23, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. KCR పిలుపు

జూబ్లీహిల్స్ బైపోల్పై మాజీ CM KCR మొదటి సారి మాట్లాడారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజలకు BRS నేతలు, కార్యకర్తలు వివరించి, అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్ను నిలబెట్టి HYD ప్రజల విజ్ఞతకు కఠిన పరీక్ష పెట్టిందన్నారు. రౌడీషీటర్ను ఓడించి, HYDలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ దోపిడీ పాలనతో తెలంగాణను గుల్లా చేసిందన్నారు.