News October 23, 2025
ADB: అవినీతి చెక్ పోస్టులే నకిలీలను సరిహద్దు దాటించాయా..?

అవినీతి జరుగుతోందని చెక్పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసిన విషయం తెలిసిందే. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ సబ్బులు, డిటర్జెంట్ పౌడర్లు, కేబుల్ వైర్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇవి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి సరఫరా అయినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఈ వస్తువులను చెక్పోస్టుల సిబ్బందికి మామూళ్లు ఇచ్చి సరిహద్దు దాటించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మీ కామెంట్..?
Similar News
News October 23, 2025
ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.
News October 23, 2025
WNP: అపార్ ఐడీ జనరేషన్ వేగవంతం చేయాలి: కలెక్టర్

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్కు కలెక్టర్ ఆదర్శ్ సురభి పలు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డ్రాప్ అవుట్స్ విషయంలో ఫాలోఅప్ చేసి, విద్యార్థులు కళాశాలలకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చూడాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.
News October 23, 2025
పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

TG: టెన్త్ ఫైనల్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు తేదీలను స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ప్రకటించింది. OCT 30-NOV 13లోపు HMలకు ఫీజు చెల్లించాలని తెలిపింది. వాళ్లు ఆన్లైన్లో NOV 14లోపు ఫీజు చెల్లించాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు DEOలకు అందించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో DEC 2-11 వరకు, రూ.500 లేట్ ఫీజ్తో DEC 15-29 వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించింది.