News October 23, 2025

తంగళ్ళపల్లి: 3 రోజుల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి

image

తండ్రి, కొడుకు మృతి చెందడంతో తంగళ్ళపల్లిలో విషాదం నెలకొంది. మంగళవారం తండ్రి మెరుపుల పర్షరాములు(70) మృతిచెందగా, గురువారం కొడుకు శ్రీనివాస్(45) అనారోగ్యంతో కన్నుమూశాడు. గల్ఫ్‌ నుంచి
తిరిగి వచ్చిన శ్రీనివాస్ కులవృత్తి చేసుకుంటు జీవించేవాడు. అతడికి భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ వరుస ఘటనలతో కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు.

Similar News

News October 23, 2025

ఇరిగేషన్ మరమ్మతుల ప్రతిపాదనలు సిద్ధం చేయండి: కలెక్టర్

image

జిల్లాలో రూ.258 కోట్లతో 350 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతుల పునరుద్ధరణ, పునర్నిర్మాణం పనుల ప్రతిపాదనను వెంటనే ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు.
గురువారం ఆమె కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. 200 చిన్న తరహా సాగు, తాగునీటి చెరువుల ఫిల్లింగ్‌కు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే అందించాలన్నారు.

News October 23, 2025

ఉద్యోగ ఒత్తిడి ప్రాణాంతకం: ప్రొఫెసర్

image

దీర్ఘకాలిక ఉద్యోగ ఒత్తిడి, టాక్సిక్ ఆఫీస్ కల్చర్ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించి, అకాల మరణానికి కూడా దారితీయవచ్చని స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. జెఫ్రీ పిఫెర్ హెచ్చరించారు. అధిక పని గంటలు, ఉద్యోగ భద్రత లేమి వంటి అంశాలు ఒత్తిడి సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణాలని ఆయన తెలిపారు. హానికరమైన ఉద్యోగంలో కొనసాగడం వ్యక్తి శ్రేయస్సుకు ప్రమాదమని ఈ అంశాన్ని ముఖ్యమైన ప్రజారోగ్య సమస్యగా అభివర్ణించారు.

News October 23, 2025

WNP: అపార్ ఐడీ జనరేషన్ వేగవంతం చేయాలి: కలెక్టర్

image

వనపర్తి జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపల్స్‌కు కలెక్టర్ ఆదర్శ్ సురభి పలు ఆదేశాలు జారీ చేశారు. అపార్ ఐడీ జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. డ్రాప్ అవుట్స్ విషయంలో ఫాలోఅప్ చేసి, విద్యార్థులు కళాశాలలకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది ఇంటర్ బోర్డు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేలా చూడాలని, వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశించారు.