News October 23, 2025
నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్.. సీఎస్కు సమ్మె నోటీసు

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని సీఎస్కు ఉన్నత విద్యాసంస్థల యాజమాన్యాలు సమ్మె నోటీసు ఇచ్చాయి. బకాయిలు చెల్లించకపోతే నవంబర్ 3 నుంచి కాలేజీలు బంద్ చేస్తామని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) హెచ్చరించింది. టోకెన్లు ఇచ్చి రూ.900 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. దీపావళికి ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
Similar News
News October 23, 2025
తేలని ‘స్థానిక’ అంశం!

TG: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తదుపరి సమావేశంలో చర్చిద్దామని CM రేవంత్ చెప్పినట్లు సమాచారం. BCలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే NOV 3న HC తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు. ఆ రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్స్పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
News October 23, 2025
HYDలో సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ ఇన్నోవేషన్ సెంటర్

TG: USకు చెందిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. CM రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డితో జరిగిన భేటీలో ఈ విషయాన్ని వెల్లడించింది. HYDను ఎంచుకోవడాన్ని CM స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధి, రాష్ట్రాన్ని 2047నాటికి $3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే రాష్ట్ర ప్రభుత్వ ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ను ఆయన వారికి వివరించారు.
News October 23, 2025
బంగ్లాదేశ్కు ఏపీ ప్రభుత్వం లేఖ

AP: విజయనగరం(D)కి చెందిన 8మంది మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి నావికాదళానికి పట్టుబడడం తెలిసిందే. దీంతో వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వారి విడుదలపై ఏపీ ప్రభుత్వం బంగ్లాదేశ్ GOVTకి లేఖ రాసింది. వారిని క్షేమంగా వెనక్కు రప్పిస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఆందోళన వద్దని ఆ కుటుంబాలకు సూచించారు.