News October 23, 2025

అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు గుడ్ న్యూస్

image

BA, B.COM, BSC చదువుతున్న విద్యార్థులకు అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ గుడ్‌న్యూస్ ప్రకటించింది. 2019-24 మధ్యలో చేరిన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లించే గడువును పొడిగించింది. విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును నవంబర్ 13లోపు చెల్లించాలని స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. వర్సిటీ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలున్నాయన్నారు. సందేహాలుంటే 040-23680333 నంబరుకు ఫోన్ చేయాలని కోరారు.

Similar News

News October 23, 2025

జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపిక

image

పోచంపల్లి మండలం పెద్ద రావులపల్లి గ్రామానికి చెందిన తప్పెట పవన్ కుమార్ జాతీయస్థాయి పిస్టల్ పోటీలకు ఎంపికయ్యాడు. కేరళ రాజధాని తిరువనంతపురంలో అక్టోబర్ 11 నుంచి 14 వరకు జరగనున్న 16వ సౌత్ జోన్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ పోటీల్లో అతను తెలంగాణ తరపున పాల్గొననున్నాడు. పవన్ ఎంపిక పట్ల ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

News October 23, 2025

పర్వతగిరి: రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చిన ఏజెంట్లు..!

image

<<18081238>>సీడ్ పేరుతో రైతులను నట్టేట ముంచారని గురువారం<<>> “Way2News”లో ప్రచురించిన కథనానికి గాను గ్రామానికి చెందిన ఏజెంట్లు రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చారు. రైతులకు సంబంధించిన రూ.70 లక్షలను నవంబర్ 10వ తేదీ వరకు చెల్లిస్తామని, చెల్లించకపోతే గ్రామంలో తమకున్న భూమిని జప్తు చేసుకునే అధికారం రైతులకు కల్పిస్తూ అగ్రిమెంట్ పత్రం రాసి ఇచ్చారు. దీంతో తాత్కాలికంగా రైతులు శాంతించారు.

News October 23, 2025

చిత్తూరులో భద్రత కట్టుదిట్టం.!

image

చిత్తూరు మాజీ మేయర్ కటారి <<18085908>>అనురాధ దంపతుల<<>> హత్య కేసు తీర్పు నేపథ్యంలో పోలీసులు భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. CHUDA చైర్‌పర్సన్ కె.హేమలత, మాజీ MLA సి.కె.బాబు నివాసాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనంగా న్యాయమూర్తి, APP, డిఫాక్టో కంప్లైనెంట్ నివాసాల వద్ద సైతం భద్రత పెంచారు. నేరపూర్వ చరిత్ర ఉన్న వారిపై నిఘా కొనసాగుతోందని DSP సాయినాథ్ తెలిపారు.