News October 23, 2025

NZB: రియాజ్ పై కాల్పుల విచారణ అధికారిగా ఎల్లారెడ్డి DSP

image

రియాజ్ పై కాల్పుల ఘటనపై కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి DSP శ్రీనివాస్‌రావు విచారణ అధికారిగా నియమితులయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి విచారణ అధికారిని నియమించారు. HRC నవంబర్ 24లోపు నివేదికను కోరిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది? అన్నది తేల్చేందుకు ఎల్లారెడ్డి డీఎస్పీ రంగంలోకి దిగారు. బుధవారం జీజీహెచ్ కాల్పులు జరిగిన ప్రాంతాన్ని డీఎస్పీ శ్రీనివాస్‌రావు పరిశీలించి విచారణ జరుపుతున్నారు.

Similar News

News October 24, 2025

జగిత్యాల: PSలలో విద్యార్థులు..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ(Police Flag Day) వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు PSల పనితీరు, డయల్ 100 సేవలు, FIR నమోదు విధానం, సీసీ కెమెరాల ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ, ఫ్రెండ్లీ పోలీసింగ్, భరోసా సెంటర్ సేవలు, షీ టీంల వ్యవస్థ తదితర వాటిపై అవగాహన కల్పించారు.

News October 24, 2025

జగిత్యాల: వివాహిత ఆత్మహత్య.. భర్తకు 10ఏళ్ల జైలు

image

జగిత్యాల జిల్లా బీరపూర్ మండలం మంగేళకి చెందిన లహరి అలియాస్ ప్రియాంకను సారంగాపూర్ మండలం కోనాపూర్‌కి చెందిన రాజేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో అదనపు వరకట్నం కోసం భర్త రాజేందర్ లహరిని వేధించడంచో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నారాయణ గురువారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

News October 24, 2025

సిరిసిల్ల: ‘ప్రతి పేద మహిళ సంఘాల్లో చేరాలి’

image

జిల్లాలోని ప్రతి పేద మహిళ స్వయం సహాయక సంఘాల్లో సభ్యురాలిగా ఉండాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్ కోరారు. జిల్లాలోని సెర్ప్ డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా దివ్యా దేవరాజనతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ గరీమా అగ్రవాల్ పాల్గొన్నారు.