News October 23, 2025
SRCL: జీతాలు మాయం చేసిన సెక్రటరీ అరెస్ట్

మల్టీపర్పస్ వర్కర్ల జీతాలను మాయం చేసిన మాజీ పంచాయతీ సెక్రెటరీ సయ్యద్ ముక్తార్ అహ్మద్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఇల్లంతకుంట SI అశోక్ తెలిపారు. ప్రస్తుతం వీర్నపల్లి మండలానికి బదిలీ అయిన ముక్తార్ ఐదుగురు మల్టీపర్పస్ కార్మికుల రూ.1,42,000లను చెక్కుల ద్వారా తన వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడని వివరించారు. ఓగులాపూర్ గ్రామపంచాయతీలో 2025 జనవరి నుంచి మే నెల వరకు అతడు విధులు నిర్వర్తించాడు.
Similar News
News October 24, 2025
ఆదిలాబాద్: పదో తరగతి పరీక్ష ఫీజు షెడ్యూల్ విడుదల

పదో తరగతి ఫైనల్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీలను డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించిందని DEO ఖుష్బూ గుప్తా పేర్కొన్నారు. అక్టోబరు 30 నుంచి నవంబర్ 13 లోపు పాఠశాల హెడ్మాస్టర్లకు విద్యార్థులు ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. HMలు ఆన్లైన్ ద్వారా నవంబర్ 14 లోపు ఫీజు చెల్లింపు చేయాలని, విద్యార్థుల డేటాను నవంబర్ 18లోపు అందించాలని సూచించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు అవకాశం ఉందన్నారు.
News October 24, 2025
పెండింగ్ కేసులు పరిష్కరించాలి: MHBD ఎస్పీ

మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పోలీస్ అధికారులతో క్రైమ్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా నమోదైన క్రిమినల్ కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించారు. పెండింగ్లో ఉన్న కేసులు, మహిళల భద్రత, సైబర్ నేరాలు, అక్రమ రవాణాలు, గంజాయి నియంత్రణ చర్యలు, ప్రజాశాంతి భద్రత అంశాలపై సమగ్రంగా చర్చించారు. కేసులు పెండింగ్లో ఉంచకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News October 24, 2025
జగిత్యాల: అక్టోబర్ 27 లాస్ట్ డేట్..!

జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు నామినల్ రోల్(NR) కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ 27 చివరి తేదీ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి.నారాయణ తెలిపారు. గ్రూప్, సెకండ్ లాంగ్వేజ్ లేదా వివరాల్లో సవరణల కోసం కళాశాల ప్రిన్సిపల్ను సంప్రదించాలని ఆయన సూచించారు. తరువాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. వివరాలు వెబ్సైట్ https://tgbie.cgg.gov.in/dvc.doలో చూడొచ్చన్నారు.