News October 23, 2025

ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేతకు క్యాబినెట్ ఆమోదం

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018లో సెక్షన్ 21(3)ని తొలగించాలని నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే పలువురు మంత్రులు ప్రకటించగా తాజాగా సీఎం అధ్యక్షతన భేటీ అయిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా ధ్రువీకరించారు.

Similar News

News October 24, 2025

జస్టిస్ సూర్యకాంత్ గురించి తెలుసా?

image

సుప్రీంకోర్టు తదుపరి <<18083662>>సీజేఐ<<>> రేసులో ఉన్న జస్టిస్ సూర్యకాంత్ 1962లో హరియాణాలోని హిసార్‌లో జన్మించారు. 1984లో లా డిగ్రీ అందుకున్న ఆయన 2000లో హరియాణా AGగా, 2004లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2018లో హిమాచల్‌‌ప్రదేశ్ HC ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి అందుకున్నారు. ఒకవేళ ఆయన CJI నియమితులైతే నవంబర్ 24న బాధ్యతలు చేపట్టి 2027 ఫిబ్రవరి వరకు కొనసాగుతారు.

News October 24, 2025

ఢిల్లీలో తొలి కృత్రిమ వర్షం.. టెస్ట్ సక్సెస్

image

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారి కృత్రిమ వర్షానికి ఏర్పాట్లు పూర్తయినట్లు సీఎం రేఖాగుప్తా తెలిపారు. బురారి ప్రాంతంలో ఇవాళ ప్రయోగాత్మక పరీక్ష సక్సెస్ అయినట్లు పేర్కొన్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ నెల 29న ఢిల్లీలో కృత్రిమ వర్షానికి అవకాశముందన్నారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందని ఆకాంక్షించారు. ఈ ఆవిష్కరణతో వాతావరణాన్ని సమతుల్యంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

News October 24, 2025

ఇజ్రాయెల్‌ను పరోక్షంగా హెచ్చరించిన ట్రంప్

image

పాలస్తీనాలో భాగమైన వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకుంటే ఇజ్రాయెల్ తమ మద్దతును పూర్తిగా కోల్పోతుందని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. వెస్ట్ బ్యాంక్‌ను స్వాధీనం చేసుకోదనే విషయమై తాను అరబ్ దేశాలకు మాట ఇచ్చానని పేర్కొన్నారు. అటు వెస్ట్ బ్యాంక్ స్వాధీనానికి అంగీకారం తెలిపేలా బిల్లులను ఇజ్రాయెల్ పార్లమెంట్ తీసుకొచ్చింది. కాగా ఈ వెస్ట్ బ్యాంక్‌‌ను యూదుల చారిత్రాక కేంద్రంగా ఇజ్రాయెల్ భావిస్తోంది.