News October 23, 2025
వర్షంతో ఆటకు అంతరాయం

WWC: నవీ ముంబైలో న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్కు వర్షం వల్ల ఆటంకం కలిగింది. 48 ఓవర్ల తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్లకు చేరుకోగా, గ్రౌండ్ స్టాప్ కవర్లతో మైదానాన్ని కప్పేశారు. ప్రస్తుతం రోడ్రిగ్స్ 69, హర్మన్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 329/2గా ఉంది. అంతకుముందు ప్రతీకా రావల్(122), స్మృతి(109) సెంచరీలతో చెలరేగిన విషయం తెలిసిందే.
Similar News
News October 24, 2025
PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్లో ప్లేఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.
News October 24, 2025
కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు.. దోషాలను!

వెన్న దొంగతనం అనేది కృష్ణుడి లీల మాత్రమే కాదు. దీని వెనుక వేరే పరమార్థం ఉంది. వెన్న దాచిపెట్టే అత్తాకోడళ్ల ఇళ్లలో స్వార్థం, అహంకారం, అతిథి సత్కారం చేయకపోవడం వంటి దోషాలుండేవి. వాటిని భగ్నం చేయడానికి కోడలిపై నింద పడేలా చేసి, వారి మధ్య తగవులు పెట్టాడు. తద్వారా వారి మనస్సులు లౌకిక చింతల నుంచి తనపై కేంద్రీకృతమయ్యేలా చేశాడు. ఇలా వారిని భక్తి మార్గానికి మళ్లించి, మోక్షాన్ని ప్రసాదించాడు. <<-se>>#KRISHNALEELA<<>>
News October 24, 2025
కృత్రిమ వర్షం గురించి తెలుసా?

క్లౌడ్ సీడింగ్ అనే విధానంలో <<18087168>>కృత్రిమ<<>> వర్షాన్ని కురిసేలా చేస్తారు. ఈ పద్దతిలో ప్రత్యేక విమానాలు నల్లని(నింబోస్ట్రాటస్) మేఘాలపైకి వెళ్లి సిల్వర్ అయోడైడ్, పొటాషియం అయోడైడ్, డ్రై ఐస్ వంటి రసాయనాల మిశ్రమాన్ని చల్లుతాయి. దీంతో ఆ మేఘాలలోని నీటి బిందువుల ఘనీభవించి వర్షంగా కురుస్తాయి. ఈ ప్రక్రియకు 30 నిమిషాల సమయం పడుతుంది. కాగా ఢిల్లీ ప్రభుత్వం దీని కోసం రూ.3 కోట్లు వెచ్చిస్తున్నట్లు సమాచారం.


