News October 23, 2025

₹6500 కోట్లతో పల్లె పండుగ 2.0

image

AP: గ్రామాల రూపురేఖలు మార్చేలా పల్లె పండుగ-2.0కు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. దీనికోసం ₹6500 కోట్లతో 52వేల పనులు చేపట్టి సంక్రాంతికి పూర్తి చేసేలా ప్లాన్ రూపొందిస్తోంది. ఈనెలాఖరు లేదా నవంబర్ తొలివారంలో ప్రారంభిస్తారని తెలుస్తోంది. గతేడాది ఇదే ప్రోగ్రాం కింద ₹4500 కోట్లు ఖర్చు చేశారు. ఈసారి కూడా గతంలో మాదిరి రోడ్లు, కాలువలు, గోకులాలతో పాటు 1107 పంచాయతీల్లో మ్యాజిక్ డ్రెయిన్ ఇతర పనులు చేపట్టనున్నారు.

Similar News

News October 24, 2025

శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

image

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>

News October 24, 2025

వైన్స్‌లకు 95,285 దరఖాస్తులు

image

TG: రాష్ట్రంలో 2,620 మద్యం షాపుల కోసం 95,285 అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 2023లో 1.31 లక్షల దరఖాస్తులు రాగా ఈ సారి దాదాపు 36వేలు తగ్గాయి. కాగా ఫీజు రూ.3 లక్షలకు పెంచడం, ఏపీ మద్యం పాలసీ ఎఫెక్ట్ వంటివి దరఖాస్తులు తగ్గడానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఈసారి అప్లికేషన్లతో ప్రభుత్వ ఖజానాకు రూ.2,858 కోట్ల ఆదాయం సమకూరుతుంది.

News October 24, 2025

PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ప్లే‌ఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.