News October 23, 2025
పత్తి కొనుగోలుపై అదనపు కలెక్టర్ సమీక్ష

మహబూబాబాద్ కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పత్తి కొనుగోలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో పత్తి కొనుగోలు యాక్షన్ ప్లాన్ను అధికారులకు వివరించారు. 2025-26 ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 84,728 ఎకరాల్లో పత్తి పంట సాగు జరిగిందని 6,14,000 క్వింటాల పత్తి దిగుబడి వస్తుందన్నారు. జిల్లాలో పత్తి పంట కొనుగోలు చేసేందుకు ఆరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు.
Similar News
News October 24, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

పవర్గ్రిడ్ కార్పొరేషన్లో 7 ఆఫీసర్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. LLB/LLM ఉత్తీర్ణులైనవారు నవంబర్ 14 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోపరిమితిలో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.500. CLAT-2026లో అర్హత, డాక్యుమెంట్ వెరిఫికేషన్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
News October 24, 2025
గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనకు ఆమోదం

తిరుపతి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీవ్ర చర్చకు దారి తీసిన గ్రేటర్ తిరుపతి ప్రతిపాదనను కార్పొరేటర్లు ఆమోదం తెలిపారు. కొందరు సభ్యులు విలీన వినతిని, వ్యతిరేకత ఉన్న వాటిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. మరికొందరు మాత్రం వెంటనే ఆమోదించి విలీనాన్ని చూడాలని కోరారు. దీనిపై మేయర్ ప్రతిపాదన ఆమోదం కలెక్టర్కు పంపుతామన్నారు.
News October 24, 2025
కాసేపట్లో భారీ వర్షం..

TG: రాబోయే 2 గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ఆ తర్వాత సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో వానలు పడతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి వరకు వర్షాలు కురుస్తాయన్నారు.


