News October 24, 2025
ఓస్లో సదస్సుకు హాజరు కానున్న ఏలూరు ఎంపీ

నార్వే ప్రభుత్వం నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హాజరుకానున్నారు. లింగ సమానత్వం, మహిళా సాధికారతపై ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం ఆధ్వర్యంలో నార్వే ప్రభుత్వ సహకారంతో ఓస్లోలో నవంబర్ 2 నుంచి 8 వరకు సదస్సు నిర్వహిస్తున్నారు. భారతదేశం తరఫున హాజరయ్యే ఎంపీల బృందంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఉన్నారు. గత నెల 24న ఆహ్వానం అందినట్లు ఎంపీ గురువారం తెలిపారు.
Similar News
News October 24, 2025
ఓయూలో UPSC ప్రిలిమ్స్ శిక్షణ FREE

OUలోని సివిల్ సర్వీసెస్ అకాడమీలో UPSC ప్రిలిమ్స్ శిక్షణలో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ డా.నాగేశ్వర్ తెలిపారు. ఈ ఉచిత శిక్షణ UPSC ప్రిలిమ్స్తో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆయన చెప్పారు. వర్సిటీ క్యాంపస్, కాన్స్టిట్యూయెంట్ కళాశాలల్లో PG, PHD చేస్తున్న వారు అర్హులు. నవంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని డా.నాగేశ్వర్ సూచించారు.
SHARE IT
News October 24, 2025
డీఎస్పీకి RRR కితాబివ్వడం సరికాదు: కొత్తపల్లి

డిప్యూటీ స్పీకర్ రఘురామ భీమవరం డీఎస్పీకి కితాబులిస్తూ మాట్లాడటం సరికాదని కాపు కార్పొరేషన్ ఛైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు అన్నారు. ‘ప.గో జిల్లాలో పేకాట సహజమంటూ RRR చెప్పడం వల్ల ఇక్కడి ప్రజలపై తప్పుడు భావన వెళ్లే ప్రమాదం ఉంది. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలపై డిప్యూటీ సీఎం హోదాలో విచారించి నివేదిక ఇవ్వమన్నారే తప్ప ముందస్తుగా చర్యలు తీసుకోమనలేదు. దీనిపై పవన్తో RRR నేరుగా మాట్లాడాల్సింది’ అని అన్నారు.
News October 24, 2025
మంత్రి సత్యకుమార్ దిగ్భ్రాంతి.. వైద్య సేవలకు ఆదేశం

AP: తెల్లవారుజామున కర్నూలు దగ్గర జరిగిన బస్సు ప్రమాదం అత్యంత విషాదకరమని మంత్రి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘పదుల సంఖ్యలో ప్రయాణికులు మరణించారని తెలిసి దిగ్భ్రాంతి చెందాను. మృతుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారికి వైద్యసేవలు అందించాల్సిందిగా కర్నూలు GGH సూపరింటెండెంట్ను ఆదేశించాను. FSL టీమ్లను సంఘటనాస్థలికి పంపించాం’ అని తెలిపారు.


