News October 24, 2025

జగిత్యాల: అక్టోబర్ 27 లాస్ట్ డేట్..!

image

జగిత్యాల జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులు నామినల్ రోల్(NR) కరెక్షన్ చేసుకోవడానికి అక్టోబర్ 27 చివరి తేదీ అని జిల్లా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి బి.నారాయణ తెలిపారు. గ్రూప్, సెకండ్ లాంగ్వేజ్ లేదా వివరాల్లో సవరణల కోసం కళాశాల ప్రిన్సిపల్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు. తరువాత మార్పులకు అవకాశం లేదని స్పష్టం చేశారు. వివరాలు వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/dvc.doలో చూడొచ్చన్నారు.

Similar News

News October 24, 2025

విజయనగరంలో హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ ప్రారంభం

image

SC కార్పొరేషన్ ఆధ్వర్యంలో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 15 మంది యువతకు 45 రోజుల ఉచిత హెవీ వెహికల్ డ్రైవింగ్ శిక్షణ నేడు ప్రారంభమైంది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో శిక్షణా బస్సుకు JC సేతు మాధవన్ జెండా ఊపి ప్రారంభించారు. వీటి అగ్రహారం RTC శిక్షణా కేంద్రంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో SC కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

News October 24, 2025

స్కూల్ పైనుంచి పడిన విద్యార్థిని పరిస్థితి విషమం

image

తాడేపల్లిగూడెంలోని తాళ్ల ముదునూరుపాడులోని మాగంటి అన్నపూర్ణా దేవి బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కొమ్ము హాసిని బిల్డింగ్ పైనుంచి పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం జరిగిన ఈ సంఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలికను హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. విజయవాడ ఆస్పత్రిలో బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉందని తండ్రి రవికుమార్ శుక్రవారం సాయంత్రం తెలిపారు.

News October 24, 2025

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం: పరిగి ఎమ్మెల్యే

image

ప్రజల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. పరిగి నియోజకవర్గం గండీడ్ మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం 24 మంది లబ్ధిదారులకు రూ.24,02,784 విలువైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. అధికారులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.