News October 24, 2025
శివుడి మాట కాదని పుట్టింటికి వెళ్లిన సతీదేవి

దక్షప్రజాపతి తాను చేయబోయే యజ్ఞానికి సమస్త దేవతలను, రుషులను, బంధువులను ఆహ్వానించాడు. కానీ కన్న కూతురైన సతీదేవిని, అల్లుడు శివుడిని మాత్రం ఆహ్వానించలేదు. ఈ విషయం తెలుసుకున్న సతీదేవి, శివుడు వద్దన్నా పుట్టింటికి బయలుదేరింది. తల్లిదండ్రులపై ఉన్న మమకారంతో నందీశ్వరుని అనుమతి తీసుకుని, శివగణాలను వెంటబెట్టుకుని దక్షప్రజాపతి ఇంటికి చేరింది. శివుడు చెప్పినట్లే ఆమెకు అక్కడ అవమానం ఎదురైంది. <<-se>>#Shakthipeetham<<>>
Similar News
News February 20, 2026
ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్: కేంద్రమంత్రి

ఏఐ సమ్మిట్ గ్రాండ్ సక్సస్ అయిందని కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ సదస్సుకు ఐదు లక్షల మందికిపైగా విజిటర్స్ వచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మౌలికవసతుల్లో $250 బిలియన్ల పెట్టుబడులకు సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. వీటిలో ఎక్కువగా డేటా సెంటర్స్, సెమీకండక్టర్ ఫెసిలిటీస్కు సంబంధించిన పెట్టుబడులే ఉన్నాయని వెల్లడించారు. త్వరలోనే ఏఐ మిషన్ 2.0 ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
News February 20, 2026
ఏఐ ఎఫెక్ట్.. రోజుకు 6లక్షల కిలోవాట్ అవర్ల విద్యుత్ ఖర్చు!

ఏఐ వాడకం వల్ల ఆ ఎఫెక్ట్ విద్యుత్, నీటిపై పడుతోంది. ఒక ప్రాంప్ట్ కోసం 0.34 వాట్ అవర్స్ విద్యుత్ అవసరమవుతోంది. ఒక యూజర్ ఏఐ వాడకంతో రోజుకు సగటున 6.8 వాట్స్ అవర్స్ విద్యుత్ ఖర్చు అవుతోందట. ఇక 100 మిలియన్ యూజర్లకు 6.8లక్షల kWh ఖర్చవుతోందట. ఇక ఏఐ డేటా సెంటర్ల నిర్వహణ కోసం నీటిని భారీగా వినియోగిస్తున్నారు. 2023లో 6.1 బిలియన్ గ్యాలన్ల మంచినీటిని ఉపయోగించినట్లు గతంలో గూగుల్ ఇచ్చిన రిపోర్ట్ చెబుతోంది.
News February 20, 2026
ఆయేషా మీరా హత్య కేసులో కీలక ఆదేశాలు

AP: ఆయేషా మీరా హత్య కేసులో వైద్య బృందం సేకరించిన అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని VJA సీబీఐ కోర్టు పేర్కొంది. FEB 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియలు చేయాలని, అందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రీపోస్ట్మార్టం కోసం 2019లో తెనాలి కబరిస్తాన్ నుంచి ఆయేషా అవశేషాలను సేకరించారు. 2007లో విజయవాడ శివార్లలోని ఓ బీఫార్మసీ కాలేజ్ హాస్టల్లో ఆయేషా హత్యకు గురైన విషయం తెలిసిందే.


