News April 9, 2024

మదనపల్లె: అప్పుల బాధతో చేనేత కార్మికుడు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళ లేక చేనేత కార్మికుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉగాది పండుగ రోజు ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపాడు.  2టౌన్ పోలీసుల కథనం… మదనపల్లె, నీరుగట్టువారిపల్లి, మాయబజార్లో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు జి.మల్లికార్జున(42) భార్య మాధవి, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ముగ్గురు కూతుళ్లకు అప్పు చేసి పెళ్లిళ్లు చేశాడు. దీంతో అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

Similar News

News October 4, 2025

శ్రీకాళహస్తి నేతలకు ఊహించని షాక్

image

శ్రీకాళహస్తి ఆలయ <<17906968>>బోర్డు సభ్యత్వంపై ఆశపెట్టుకున్న<<>> లోకల్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి బోర్డులో స్థానికులు ఆరుగురికే చోటు దక్కింది. మిగిలిన 11 మంది(మొత్తం 17మంది సభ్యులు) వేరే జిల్లాలకు చెందిన వాళ్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 80 శాతం లోకల్ వాళ్లు, 20 శాతం బయట వారికి బోర్డులో అవకాశం కల్పించారు. బోర్డు ఛైర్మన్‌గా జనసేన నేత కొట్టే సాయి నియమితులైన విషయం తెలిసిందే

News October 3, 2025

తిరుపతి MP ఫిర్యాదుపై జాతీయ SC కమిషన్ స్పందన

image

దేవరంపేట గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని దహనం చేసిన ఘటనపై జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తి ఫిర్యాదు చేసిన 2 గంటలలోపే కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు 30 రోజుల్లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ నివేదికలో FIR వివరాలు, నమోదు చేసిన సెక్షన్లు అరెస్టుల సమాచారం ఇవ్వాల్సినట్లు స్పష్టం చేసింది.

News October 3, 2025

చిత్తూరు ఎస్పీ ఆధ్వర్యంలో ఆయుధపూజ

image

చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ఏఆర్ పరేడ్ గ్రౌండ్‌లో గురువారం ఆయుధపూజ నిర్వహించారు. ఆయుధ కారాగారం, పోలీసు క్యాంటీన్, జిమ్, పోలీసు అసోసియేషన్ ఆఫీస్, అడ్మిన్ కార్యాలయాలలోనూ పూజలు చేశారు. ప్రజల రక్షణకై పోలీసు సిబ్బంది తుపాకులను క్రమశిక్షణతో వాడుతుందని ఎస్పీ తెలిపారు. చెడుపై మంచి విజయం సాధించడానికి విజయదశమి ప్రతీక అన్నారు.